చంద్రబాబు ప్రజాధనంతో దేశాలు తిరిగి...

Durga Writes

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశాడు వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి. అనవసర విషయాలపై ప్రతిపక్షాలు అల్లర్లు చేస్తే బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంటాడు విజయసాయి రెడ్డి. ఎప్పుడు ప్రతిపక్ష మాటలను తిప్పికొట్టే విజయసాయి రెడ్డి ఈరోజు ట్విట్టర్ వేధికగా చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.  

 

విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేధికగా స్పందిస్తూ ''రాజధాని కోసం చంద్రబాబు మార్కెటింగ్ మేనేజర్ అవతారం ఎందుకెత్తారో  ఢిల్లీ మీడియా వర్గాలకు అప్పట్లో అంతుబట్టలేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమని ఇప్పుడర్థమైంది. ప్రజా ధనంతో దేశాలు  తిరిగి అమరావతిపై ప్రెజెంటేషన్లిచ్చాడు. పెట్టుబడుల కోసమైతే వెనకబడిన జిల్లాల గురించి ప్రస్తావించొచ్చు కదా?'' అంటూ ట్విట్ చేశారు. 

 

అప్పట్లో ఢిల్లీ మీడియాకు రాజధాని కోసం చంద్రబాబు ఎందుకు మేనేజర్ మార్కెటింగ్ అవతారం ఎత్తాడు అనేది అర్థంకాలేదు.. ఇప్పుడు అర్థం అయి ఉంటుంది వాళ్లకు.. మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ఆలా చేశారని అంటూ అయన ట్విట్ చేశాడు. ఈ ట్విట్ పై స్పందించిన నెటిజన్లు చంద్రబాబు అంతే.. 

 

ఏది వూరికే చెయ్యడు అంటూ కామెంట్లు పెట్టారు. దీంతో ఈ ట్విట్ కారణంగా అటు వైసీపీ అభిమానులు.. ఇటు టీడీపీ అభిమానుల మధ్య చిన్నపాటి యుద్ధమే నడుస్తుంది. దీంతో ఈ ట్విట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: