పవన్ కళ్యాణ్ 'హచ్ కుక్క'ని మించిపోయాడు..!

Durga Writes

ఆంధ్ర ప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విమర్శల వర్షం కురిపించారు. నేడు మీడియాతో మాట్లాడిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు మతిస్థితమితం పోయి ఏమి మాట్లాడుతున్నారో అర్థం కావడంలేదనుకుంటే.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నాడు అని మండిపడ్డారు.       

 

వైసీపీ ప్రభుత్వంపై పవన్‌ కళ్యాణ్ చేస్తున్న విమర్శలపై మంత్రి అనిల్‌ విరుచుకుపడ్డారు. అసలు పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడు అనాలో.. నటుడు అనాలో అర్ధంకావడం లేదని అయన అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గుండె దైర్యం ఉన్నవాడిని, దమ్ము ఉన్న నాయకుడు గురించి పవన్ కళ్యాణ్ కు మాట్లాడే హక్కు ఏ మాత్రం లేదని అయన అన్నారు. 

 

నమ్ముకున్న సిద్ధాంతం కోసం సోనియా గాంధీని ఎదురించిన వ్యక్తి సీఎం వైఎస్‌ జగన్‌ అని, సీఎం జగన్‌ దమ్ము, ధైర్యం గురించి ప్రజలందరికీ తెలుసని మంత్రి అనిల్ కుమార్ పేర్కొన్నారు. ప్రశ్నిస్తానన్న పవన్‌ కల్యాణ్‌ గత ఐదేళ్లలో ఏమి చేశాడో ప్రజలందరికీ తెలుసని విమర్శించారు.

 

ఎప్పుడు కులాలు, మతాల గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ కు ఈరోజు సీఎం వైఎస్‌ జగన్‌ తన మతం మానవత్వం అని స్పష్టంగా చెప్పారని పవన్ కళ్యాణ్ కు గుర్తుచేశారు. పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాలకు వెళ్తే ప్రజలను రాయలసీమ ప్రజలపై ఉసిగొలుపుతాడని రాయలసీమ ప్రజలను గుండాలు, కడప రౌడీలు, రాయలసీమ ఫ్యాక్షనిస్టులు అని తిడతారని.. రాయలసీమకు వస్తే ఒకసారి పచ్చటి పొలాలు అని అంటే మరోసారి సీమలో కరువు ఉందని చెప్తాడు.. ఎక్కడ ఏం మాట్లాడుతాడో అతనికె తెలీదు చంద్రబాబుతో చేరి ఉన్న కాస్త మతిని పోగొట్టుకున్నాడు అని సంచలన వ్యాఖ్యలు చేశాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: