ఏవోబీలో పోలీసులు మావోయిస్టుల పీఎల్జీఏ వారోత్సవాల ప్రారంభించడంతో రెడ్ అలెర్ట్ ప్రకటించారు. అవుట్ పోస్టుల ప్రాంతాల్లో అప్రమత్తమయ్యారు. మావోయిస్టులు పీఎల్జీఏ వారోత్సవాల నిర్వహణకు ఈ సోమవారం నుంచి ఏర్పాట్లు చేస్తున్నారు.రెండు నెలల కిందట జరిగిన ఎన్కౌంటర్లలో ఐదుగురు మావోయిస్టులు జీకే వీధి మండలం మాదిగమల్లు అటవీ ప్రాంతంలో మృతి చెందిన సంగతి తెలిసిందే. దింతో మావోయిస్టులు వారోత్సవాలు జరుగుతుండడంతో ప్రతీకార దాడులు జరిపే అవకాశం ఉందని సమాచారం.
దీంతో మారుమూ ల గ్రామాల ప్రజలు భయం తో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బ్రతుకుతున్నారు . అయితే పోలీసు యంత్రాంగం పీఎల్జీఏ వారోత్సవాలను భగ్నం చేసేందుకు సిద్ధమైంది. ఇరు రాష్ట్రాల పోలీసు బలగాలు కూంబింగ్లో నిమగ్నమయ్యాయి.
{{RelevantDataTitle}}