దేశంలో రోజు రోజుకీ ఆడవారికి రక్షణ లేకుండా పోతుంది..చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా కామాంధులు రెచ్చిపోయి అత్యాచారాలకు, హత్యలకు పాల్పపడుతున్నారు. తెలంగాణలో ఇప్పటికే 9 నెలలు, ఆరేళ్ల చిన్నారులపై అత్యాచార ఘటనలు జరిగాయి. ఇందులో తొమ్మిది నెలల పాప చనిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఆ నరరూప రాక్షసుడు ఉన్నాడు. అతన్ని వెంటనే ఎన్ కౌంట్ చేయాల్సిందిగా పోలీసులకు ఫోన్లు వస్తున్నాయని వార్తలు వస్తున్నాయి.
ఇక ఏపిలో సంచలనం సృష్టించిన ఒంగోలు మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం ఘటనపై వైసీపీ మహిళా ఎమ్మెల్యే, ఏపీఐఐసీ ఛైర్మన్ ఆర్కే రోజా స్పందించారు. కాగా, ‘ఒంగోలులో మైనర్ బాలికను అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసిన వారిని కఠినంగా శిక్షించాలి. 10 రోజుల పాటు 16 ఏళ్ల బాలికను అత్యాచారం చేసిన ఆ కామాంధులకు పడే శిక్షను చూసి ఆడపిల్లల వైపు కన్నెత్తి చూడాలంటే భయపడేలా శిక్షించాలి’ అని రోజా తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. ఆ తర్వాత ‘వైఎస్ జగన్ ప్రభుత్వం అంటే ఆడపిల్లలుకు పూర్తి రక్షణ కల్పించే ప్రభుత్వం.
ఇప్పటికే మా సోదరి హోమ్ మంత్రి సుచరిత గారు స్పందించి కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసిన వెధవలకి కఠిన శిక్ష పడాలని కోరుకుంటున్నా.’ అంటూ మరో ట్వీట్ చేశారు. ఇలాంటి దుర్మార్గులకు కఠిన శిక్షలు పడితేనే మరోకరు ఇలాంటి నేరాలు చేయాలంటే భయపడాలని రోజా అన్నారు. మరోవైపు ఈ ఘటనపై స్పందించిన హోంమంత్రి సుచరిత నిందితుల్ని కఠినంగా శిక్షించాలని ఆదేశించారు.
.@ysjagan గారి ప్రభుత్వం అంటే ఆడపిల్లలు కు పూర్తి రక్షణ కల్పించే ప్రభుత్వం.ఇప్పటికే మా సోదరి హోమ్ మంత్రి సుచరిత గారు స్పందించి కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.ఆడపిల్ల జజీవితాన్ని నాశనం చేసిన వెధవలకి కఠిన శిక్ష పడాలని కోరుకుంటున్నా.— Roja Selvamani (@RojaSelvamaniRK) June 24, 2019
ఒంగోలులో మైనర్ బాలికను అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసిన వారిని కఠినంగా శిక్షించాలి.10 రోజుల పాటు 16 ఏళ్ల బాలికను అత్యాచారం చేసిన ఆ కామాంధుల కు పడే శిక్ష ను చూసి ఆడపిల్లల వైపు కన్నెత్తి చూడాలంటే భయపడేలా శిక్షించాలి.— Roja Selvamani (@RojaSelvamaniRK) June 24, 2019