టిడిపి పార్టీ చేస్తున్న దుష్ప్రచారం పై వార్నింగ్ ఇచ్చిన ప్రశాంత్ కిశోర్..!
తాజాగా తనపై సోషల్ మీడియాలో టిడిపి పార్టీకి చెందినవారు పీకే పేరిట నకిలీ ట్వీట్ సృష్టించారట. ఆ విషయాన్ని ప్రశాంత్ కిషోర్ వెల్లడిస్తూ ఓటమి కళ్ల ఎదుట కనిపిస్తున్నప్పుడు ఇలాంటివే చేస్తారని ఆయన అన్నారు.
తెలుగుదేశం పార్టీ దిగజారుడు తనానికి ఇది నిదర్శనమని ఆయన అన్నారు. ప్రజల్లో విశ్వాసం కోల్పోయినప్పుడు ఇలాంటి తప్పుడు పనులు చేస్తారన్నారు. అసత్యాలు, నకిలీ వార్తలను టీడీపీ ప్రచారం చేసినా ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. ఏపీ ప్రజలు ఇప్పటికే తమ తీర్పును నిర్ణయించుకున్నారని బై..బై.. బాబు అంటూ ట్వీట్ చేశారు.