బాబోయ్‌ ఎండలు.. ప్రాణానికే ప్రమాదం?

Chakravarthi Kalyan
తెలుగు రాష్ట్రాలు నిప్పుల కుంపటిని తలపిస్తున్నాయి. ఈ ఏడాది మొదటిసారి 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే భానుడు ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. తెలంగాణలో వడగాల్పులకు రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది మంది మృతిచెందారు. రోజురోజుకు పెరిగిన ఉష్ణోగ్రతలతో... పగలు, రాత్రి వాతావరణం వేడిగా ఉంటోంది. గత ఏడాదితో పోల్చితే ఈ సమయానికి కొన్ని ప్రాంతాల్లో..ఐదు నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగింది. పని మీద బయట తిరిగే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఎండ వేడిమికి పెట్రోల్‌ బంకుల్లో.. అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ప్రచారం జరుగుతోంది. కరీంనగర్‌లోని ఓ పెట్రోల్ బంకు యజమాని స్ప్రింక్లర్లు ఏర్పాటు చేశారు. మే నెలలో 48 నుంచి 49డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. వారం పాటు వడగాల్పులు వీచే అవకాశం ఉంది. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావొద్దని హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

hot

సంబంధిత వార్తలు: