బ్రేకింగ్ న్యూస్: ఇండియా టుడే 2018-19 ఎలక్షన్ సర్వే మోడీ - కెసిఆర్ హిట్ - చంద్రబాబు ఫట్
ఈ నెల 8 నుంచి 12 తేదీల్లో అయిదు రోజుల పాటు దాదాపు 10,650 మంది నుంచి సమాచారం సేకరించారు. ఈ సర్వేలో:
ఈ సర్వేలో
*ప్రధాని నరేంద్ర మోడీకి తిరుగులేని విజయం సాధిస్తారని తెలిసింది. ప్రధానిగా నరేంద్ర మోడీకి 55 శాతం మంది. రాహుల్ కు 42 శాతం మంది ఓటు వేసినట్లుగా సర్వే వెల్లడించింది. కేంద్రంలోనూ, తెలంగాణలోనూ అధికారపక్షంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న వేళ, అందుకు భిన్నంగా తిరుగు లేదన్నట్లుగా ఫలితాలు వెల్లడిస్తున్న సర్వే ఫలితాలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.
కేంద్రంలో మోడీ పని తీరు ఎలా ఉందన్న ప్రశ్నకు తెలంగాణ వ్యాప్తంగా బాగుందన్న వారు 41 శాతం మంది చెప్పగా, బాగోలేదని చెప్పిన వారు 32 శాతం మంది ఫర్వా లేదని చెప్పిన వారు 24 శాతం మందిగా పేర్కొన్నారు. తదుపరి ప్రధానిగా ఎవరు అయ్యే అవకాశం ఉందన్న ప్రశ్నకు మోడీకే తెలంగాణ ప్రజలు ఓటు వేశారు. మోడీకి 44 శాతం మంది సానుకూలంగా స్పందిస్తే, రాహుల్ గాంధీకి 39 శాతం మంది. కేసీఆర్ కు 11 శాతం మంది ఓట్లు వేశారు.
*తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు 43 శాతం మంది తెలంగాణ ప్రజల మద్దతు ఉన్నట్లుగా ప్రకటించింది. కేసీఆర్ తర్వాత ఉత్తమ్ కుమార్ ఉన్నారు. ఉత్తం కుమార్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్న వారు కేవలం 18 శాతం మందే కావటం గమనార్హం. పొలిటికల్ స్టాక్ ఎక్సైంజ్ పేరుతో అన్ని ఎంపీ స్థానాల్లో నిర్వహించిన ఈ సర్వేలో 7110 మంది ప్రజలు పాల్గొన్నట్లు సదరు మీడియా సంస్థ పేర్కొంది. కేసీఆర్ ప్రధాని కావాలని కోరుకుంటున్నట్లుగా 11 శాతం మంది చెప్పగా, పరిసరాల పరిశుభ్రత నిరుద్యోగం, వ్యవసాయంలో ఇబ్బందులు, నిత్యావసరాల ధరల పెరుగుదల తమకు ప్రధాన సమస్యలుగా ప్రజలు పేర్కొన్నట్లు వెల్లడించారు.
*అదే సమయంలో ఈ మధ్యనే కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కుమారస్వామిపై కన్నడిగులు అసంతృప్తితో ఉన్నట్లు తేల్చింది. కర్ణాటక ప్రభుత్వ పని తీరు బాగుందన్న వారు కేవలం 23 శాతం మంది కాగా, ఫర్వాలేదన్న వారు 28 శాతమైతే, ఏ మాత్రం సంతృప్తికరంగా లేదన్న వారు 35 శాతం మంది కావటం గమనార్హం.