బెదిరింపుల చట్రంలో ముఖ్యమంత్రి - సర్వస్వం కోల్పోతున్న రాష్ట్రం
తెలుగుదేశం పార్టీ అభ్యర్ధనపైనే ప్రత్యేక హోదాకు బదులుగా ప్రత్యేక ప్యాకేజీ ఇస్తున్నామని చెప్పిన కేంద్రం, ఇప్పటిదాకా ఆ ఖాతా కింద ఒక పైసా కూడా విడుదల చేయకుండా దానిని చట్టబద్ధం చేయకుండా ఎందుకు వదిలేసిందనేది ప్రతిఒక్కరికి సమాధానం దొరకని బేతాళప్రశ్న. చివరకు ఎండిఏ ప్రభుత్వ పూర్తిస్థాయి బడ్జెట్— 2018, అంటే 2019 సాధారణ ఎన్నికలకు ముందు ప్రవేశపెడుతున్న చిట్టచివరి బడ్జెట్ లో తమ మిత్రపక్షం టీడీపీ పాలన లో ఉన్న ఏపీని సంపూర్ణంగా విస్మరించింది. ఈ తెలుగు రాష్ట్రానికి చెందిన రాజకీయాలు తమకు అవసరమే లేదన్న రీతి లోనే ఎండిఏ వ్యవహరించిందని చెప్పక తప్పదు.
బీజేపీ సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరిగిపోయింది. జైట్లీ బడ్జెట్ ప్రసంగం ముగియగానే, ఎక్కడో గుంటూరు జిల్లాలో ఉన్న చంద్రబాబు హుటాహుటీ న అమరావతిలోని తన కార్యాలయానికి చేరుకున్నారు. తమ పార్టీ ఎంపీ లను ప్రత్యేకంగా కాంఫరెన్స్ చాల్ లో సంప్రదించారు చంద్రబాబు. రాష్ట్రానికి రావాల్సిన కేటా యింపు లకు సంబంధించి కేంద్రంపై ఒత్తిడి పెంచాలని ఆదేశాలు జారీ చేశారు. ఆ వెంటనే ఎప్పటి లాగానే అందుబాటులో ఉన్న తన కేబినెట్ మంత్రులతో ఆయన ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సమావేశం లో బీజేపీ ప్రభుత్వంపై అగ్నికణికలే విసిరిన చంద్రబాబు, మళ్ళా నీరిగారి పోతూ మిత్రపక్షమైన బాజపానే ఇలా చేస్తే ఇంకేం చేస్తా మంటూ? యాజూజువల్గా ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే రాజకీయ వర్గాల్లో వినిపించేదేనటే - రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాదు నుంచే పదేళ్ళు పాలనను సాగిస్తానన్న చంద్రబాబు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో "నామినేటెడ్ ఎమ్మెల్యే" స్టీఫెన్ సన్ ఓటును కొనుగోలు చేయబోయి కెమెరాలకు దొరికి తెలంగాణా ఏసిబికి అడ్డంగా బుక్కైన విషయం ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ టీవీ చానెళ్ళ సాక్షిగా తెలిసిన సినిమాయే. బ్రీఫ్డ్-మీ రూపంలో ప్రచారంలో ఊన్న ఆ కేసుకు సంబంధించిన చార్జీషిట్లో చంద్రబాబు పేరు కూడా ఉంది. ఇది జరిగిన తర్వాత ఇంకా అక్కడే ఉంటే, కేసిఆర్ తనను ఎక్కడ అరెస్ట్ చేస్తారోనన్న భయం, తన ప్రభుత్వానికి చావు మూడుతున్న సందర్భం గ్రహించి కేసిఆర్ పాదపద్మాల దగ్గర సాగిలపడ్డాడని ఆ సంధర్భంగానే చంద్రబాబు, అప్పటికప్పుడు తన రాష్ట్ర పాలనను విజయవాడకు మార్చేసుకున్నారన్న వాదన వినిపించింది.
కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయంపై పార్లమెంటు వేదికగా పోరాడాలని సీఎం చంద్రబాబు టీడీపీ ఎంపీలకు పిలుపునిచ్చారు. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి మొండిచెయ్యి చూపడంపై పార్లమెంటులో నిరసన తెలియజేయాలన్నారు.
ఏదో జరుగుతుందని అంతా ఊహించారు. సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకుంటారని భావించారు. టీడీపీ-బీజేపీ మిత్రబంధం ఇక ముగిసినట్టే అని, బీజేపీతో తెగదెంపులు ఖాయమనే వార్తలొచ్చాయి. కానీ అలాంటిదేమీ జరగలేదు. పొత్తు విషయంలో చంద్రబాబు తొందరపడలేదు. ప్రస్తుతానికి బీజేపీతో విడాకుల ప్రస్తావన లేదని చంద్రబాబు తేల్చేశారు. కేవలం పోరాటానికే పరిమితం కావాలని డిసైడ్ అయ్యారు. మిత్రబంధం కొనసాగిస్తూనే ఒత్తిడి తేవాలని చంద్రబాబు నిర్ణయించారు.
మరింత సమాచారం తెలుసుకోండి:
-
ashok
-
revanth
-
Hyderabad
-
Amaravati
-
2019
-
Cabinet
-
Chief Minister
-
Andhra Pradesh
-
Party
-
CBN
-
Air
-
Switzerland
-
Bharatiya Janata Party
-
TDP
-
Minister
-
Parliament
-
central government
-
Telugu
-
politics
-
News
-
bhavana
-
Ishtam
-
Telugu Desam Party
-
Guntur
-
Manam
-
Evening
-
Sujana Choudary
-
Congress
-
YCP
-
Stephen Hawking
-
INTERNATIONAL
-
Arrest
-
Telangana
-
KCR
-
CM