300 అమ్మాయిలను.. మోసగించి అనుభవించాడు..

Chakravarthi Kalyan
నేరగాళ్లు కూడా టెక్నాలజీని బాగా ఉపయోగించుకుంటున్నారు. నల్గొండ జిల్లాలోని సెక్స్ సైకో అలా అమ్మాయిల జీవితాలతో ఆటాడుకున్నాడు. మెల్లగా మాటల్లో దింపి.. ఉద్యోగాల ఆశ చూపి లోబరుచుకున్నాడు. ఒకరు కాదు, ఇద్దరు కాదు.. దాదాపు 300 వందల మంది బాలికలను ఇలా మోసం చేసి వారితో సెక్స్ ఆట ఆడుకున్నాడు. 

ఓ అమ్మాయి ధైర్యం చేసి ఫిర్యాదు చేయడంతో వీడి బండారం బట్టబయలైంది. వివరాల్లోకి వెళ్తే.. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ వాసి కలకండ మధు ఓ సెక్స్ సైకో. 2007లో పుడ్ కార్పొరేషన్‌లో ఉద్యోగిగా చేరి 2011లో హైదరాబాద్‌కు బదిలీపై వచ్చి నాగోల్‌లోని సాయినగర్‌లో నివాసముంటున్నాడు. వివిధ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అమ్మాయిల వివరాలను ఇంటర్‌నెట్‌లోని విద్యాసంస్థల వెబ్‌సైట్ల నుంచి తెలుసుకునేవాడు. 

అమ్మాయిల నెంబర్లన్నీ పద్దతిగా ఓ రిజిస్టర్లో రాసుకుని వాళ్ల పుట్టిన రోజులకు గ్రీటింగ్స్ పంపేవాడు.. ఫోన్ చేసి మాటలు కలిపేవాడు. వాళ్ల స్పందన చూసి బుట్టలో పడతారనుకున్న వాళ్లను సెలక్ట్ చేసుకుని టార్గెట్ చేసేవాడు. తాను ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ ననీ.. పరీక్షలు పాస్ చేయిస్తానని.. ఉద్యోగాలు ఇప్పిస్తానని మాయ మాటలు చెప్పి ఆ బాలికలను లొంగతీసుకునేవాడు. బండ్లగూడలో తనకున్న మరో ఇంటిని ఈ కామకలాపాలకు వాడుకునేవాడు. 

ఇంతవరకూ ఈ దుర్మార్గుడు దాదాపు ఇలా 300 మంది వరకు అమ్మాయిలను లొంగదీసుకుని, వారిని అనుభవించాడని పోలీసులు తెలిపారు. ఇది ప్రాథమిక సమాచారమేనని, బాధితులు ముందుకు వస్తే మరిన్ని వివరాలు బయటపడుతాయని పేర్కొన్నారు. ఓ ఫిర్యాదుతో ఇతనిపై కన్నేసిన పోలీసులు గుట్టు  రట్టు చేశారు. ఇతని ఇళ్లపై దాడులు చేస్తే.. గుట్టల కొద్దీ కండోమ్స్, గర్భం రాకుండా సెక్స్‌కు ముందు వాడే మందులు పెద్ద ఎత్తున దొరికాయి. అందుకే టీనేజ్ అమ్మాయిలు ఇలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: