లక్షల కోట్ల అప్పు పోయి... వందల కంపెనీలు రావాలంటే ఆయన రావాల్సిందే ?

VAMSI
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్న రాష్ట్రము.. ఎనిమిది సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలుగా విడిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత అంతకుముందులా ఇప్పుడు తెలంగాణ లేదు.. వరుసగా రెండు సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కేసీఆర్ సారధ్యంలోని తెరాస విజయదుందుభి మోగించింది. ఇక ఆంధ్రప్రదేశ్ విడిపోయాక మొదటి సారి చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగా, రెండవసారి మాత్రం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీ అఖండ మెజారిటీతో గెలిచి అధికారంలోకి రావడం జరిగింది. ఏపీలో గడిచిన మూడున్నరేళ్ల వైసీపీ పాలన పట్ల మాత్రం విమర్శలు వస్తున్నా .. సంక్షేమాన్ని చెప్పిన విధంగా అన్నీ ప్రజలకు అందచేస్తూ కొంతవరకు పర్వాలేదు అనిపించుకున్నాడు.
అయితే ఈ సంక్షేమం కోసం పెద్ద ఎత్తున అప్పులు చేశాడన్న అపవాదు కూడా జగన్ పైన ఉంది. ఇదిలా ఉంటే తాజాగా చంద్రబాబు కండక్ట్ చేసిన కందుకూరు మరియు గుంటూరు సభలలో అపశ్రుతి చోటు చేసుకుని మొత్తం 11 మంది ప్రాణాలను కోల్పోయారు. ఈ విషయం పట్ల ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె ఏ పాల్ తనదైన శైలిలో రెచ్చిపోయాడు. చంద్రబాబు ను వయసును ప్రస్తావిస్తూ ఏకిపారేశాడు. అంతే కాకుండా చంద్రబాబు, జగన్ మరియు కేసీఆర్ లకు పాలన చేత కాదని వీరుంటే అభివృద్ధి జరగదని వచ్చే ఎన్నికల్లో ప్రజాశాంతికి ఓటు వేయాలని చెబుతూ , ఈ క్షణం రెండు రాష్ట్రాలను నాకు అప్పగిస్తే రెండు రాష్ట్రాలకు ఉన్న లక్షల కోట్ల అప్పును తీర్చివేయడమే కాకుండా, కంపెనీలను రాష్ట్రాలకు తీసుకువచ్చి అభివృద్ధిని చేస్తానని ఘంటాపధంగా చెప్పాడు.
అయితే కే ఏ పాల్ చేసిన ఈ వ్యాఖ్యల గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. కానీ కె ఏ పాల్ అంత సత్తా ఉన్న వ్యక్తి అని చెప్పాలి. అంటరాజాతీయంగా ఆయనకున్న పలుకుబడి వలన లక్షల కోట్లు ఇవ్వడానికి మరియు వందల కంపెనీలు తెలుగు రాష్ట్రాలలో పెట్టుబడులు పెట్టడానికి రెడీగా ఉంటారు. మరి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇవన్నీ జరగడం అసాధ్యం అని సామాన్యుడు ఆలోచిస్తున్నాడు. కానీ అందరిలాగే కే ఏ పాల్ కు కూడా ఒక అవకాశం ఇస్తే ఏమి చేస్తాడు అన్నది తెలిసిపోతుంది అంటూ మరికొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: