సీఎం జగన్ కు ప్రశాంత్ కిషోర్ తో చెడిందా ?
ఇక పట్టణ ప్రాంతాలలో మాత్రం అభివృద్ధి, పోలవరం మరియు ప్రత్యేక హామీల విషయంలో జగన్ ఫెయిల్ అయ్యారన్న విషయాలను చూపిస్తూ విమర్శలు చేస్తున్నారు. కాగా జగన్ కోసం ఎంతో కాష్టపడిన పీకే ప్రస్తుతం బీహార్ లో జనసురాజ్ అన్న పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. ఈ సందర్భంగా పీకే ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా అధిక ప్రాధాన్యతను సంతరించుకుంది. ఏపీ సీఎం జగన్ కు నేను ఎందుకు సాయం చేశానో నాకు అర్ధం కావడం లేదు, అలా చేసి తప్పు చేశానన్న భావన నా మనసులో కలుగుతోంది అంటూ వ్యాఖ్యలు చేశారు.
ఆ సమయంలో నేను జగన్ కు హెల్ప్ చేయకుండా కాంగ్రెస్ ను అభివృద్ధి చేయడానికి కృషి చేసి ఉన్న బాగుండేది అంటూ అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలు చూస్తుంటే అదేంటి వచ్చే ఎన్నికల్లో కూడా పీకే వైసీపీ గెలుపుకు కృషి చేయాలని కోరుకుంటుంటే సడెన్ గా పీకే ఇలా షాక్ ఇచ్చాడు అంతో అంతర్మథనంలో పడ్డారు వైసీపీ శ్రేణులు. అసలు జగన్ కు పీకే కు మధ్యన ఏమి జరిగింది ? ఈ విధంగా కామెంట్ చేసేలా ఎందుకు చెడింది అన్న కోణంలో అభిమానులు ఆలోచిస్తున్నారు. ఇక అదే మీడియా సమావేశంలో బీహార్ సీఎం నితీష్ కుమార్ పై కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేయడం విశేషం.