షాకింగ్: ఏపీలో ఎక్కువవుతున్న బీపి, షుగర్ పేషెంట్స్?

Purushottham Vinay
ఏపీలో బీపి, షుగర్ పేషెంట్స్ చాలా ఎక్కువవుతున్నారు.ఇక ప్రజల్లో తమ ఆరోగ్య స్థితిగతులపై అవగాహన కల్పించేందుకు ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ నాన్‌ కమ్యునికెబుల్ డిసీజెస్ (NCD) సర్వే చేపడుతోన్న సంగతి తెలిసిందే.ఇందులో భాగంగా ఇప్పటివరకు కూడా రాష్ట్రవ్యాప్తంగా జిల్లాలవారీగా మూడుకోట్ల మందికి పైగా మందికి వైద్య సిబ్బంది స్క్రీనింగ్‌ టెస్టులు నిర్వహించారు. ఇందులో మొత్తం 1.87 కోట్ల మంది 30 ఏళ్ల వయస్సు పైబడిన వారే.అయితే ఈ తాజా హెల్త్‌ సర్వేలో కొన్ని షాకింగ్‌ విషయాలు బయటపడ్డాయి. ఇందులో 26.35 శాతం అంటే 49,54,106 మందిలో రక్తపోటు ఇంకా 25.64 శాతం అంటే 48,20,138 మందిలో మధుమేహం ఉన్నట్లు వైద్య సిబ్బంది గుర్తించారు.ఇక అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో అయితే 6,82,189 మందిలో 30 ఏళ్లు పైబడిన వారిని స్క్రీనింగ్‌ టెస్టులు చేయగా అత్యధికంగా 38.02 శాతం మందిలో రక్తపోటు ఇంకా 35.54 శాతం మందిలో మధుమేహం సమస్యలు ఉన్నట్లు తేలింది. 


కాగా మారిన ఆహారపు అలవాట్లు, విపరీతమైన పని ఒత్తిడి ఇంకా అనారోగ్యకరమైన జీవనశైలి ఈ అనారోగ్య సమస్యలకు కారణమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈక్రమంలోనే 30 ఏళ్లకే రక్తపోటు ఇంకా మధుమేహం లాంటి దీర్ఘకాలిక వ్యాధులు యువతలో బయటపడుతున్నాయంటున్నారు. పట్టణాలు ఇంకా నగరాలతో పాలు మారుమూల గ్రామాలు అలాగే పల్లెల్లోనూ ఈ జబ్బుల సమస్య ఉందంటున్నారు. కాగా ధూమపానం, మద్యపానం వంటి చెడు అలవాట్లు ఇంకా శారీరక శ్రమ లేకపోవడం అలాగే అతిగా జంక్‌ఫుడ్‌ తినడం తదితర కారణాలతో ఈ దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు తలెత్తుతోందని హెల్త్‌ ఎక్స్‌పర్ట్స్‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ క్రమంలో ముందు జాగ్రత్తగా 30 ఏళ్లు దాటిన వారు బీపీ ఇంకా అలాగే షుగర్‌ పరీక్షలు చేయించుకోవాలని కూడా సూచిస్తున్నారు.కాబట్టి ఖచ్చితంగా ఈ పరీక్షలు చేయించుకోండి. ఎల్లప్పుడూ కూడా ఆరోగ్యంగా ఉండండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: