సీఎం జగన్ కొత్త ప్లాన్ వైసీపీ కి ప్లస్ అవుతుందా ?
ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి తమ వంతు కృషి తాము చేస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి రోజా సెల్వమని కూడా గడప గడపకు వెళ్లడం మొదలు పెట్టిన విషయం తెలిసిందే. శనివారం నాడు మండల పరిధిలోని జగన్నాథపురంలో గడప గడపకు వర్షంలోనూ ఆపకుండా వెళ్లారు. పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా గొడుగు చేత పట్టుకుని ఇంటింటికీ వెళ్లి ప్రజలను పలకరిస్తూ సంభాషణలు జరిపారు. వైసిపి పార్టీ అధికారంలోకి వచ్చాక గత మూడేళ్ల నుండి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అన్ని కూడా సదరు లబ్ధిదారులకు అందుతున్నాయా ? లేదా ? అని ప్రజలను అడిగి తెలుసుకోవడమే కాకుండా ప్రజల యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటున్నారు.
ఈ విధంగా దాదాపుగా అందరు ప్రజాప్రతినిధులు వెళుతున్నారు. కానీ దీని వెనుక పెద్ద ప్లాన్ ఉందట. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ఇబ్బంది లేకుండా ఇప్పుడే ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. మరి ఇది ఎంత వరకు జగన్ ప్రభుత్వానికి ప్లస్ అవుతుంది అనేది తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.