హైదరాబాద్ మహా నగరంలోని... పీపుల్స్ ప్లాజా వద్ద 20 మొబైల్ SCTP వాహనాలను ప్రారంబించారు తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ మరియు ఐటీ శాఖ మంత్రి వర్యులు కేటిఆర్. అయితే.. ఈ మహోత్తర కార్య క్రమంలో.. పాల్గొన్నారు మంత్రి తలసాని, మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి, ఎమ్మెల్యే దానం నాగేందర్, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత. ఇక సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ మరియు ఐటీ శాఖ మంత్రి వర్యులు కేటిఆర్ ఆసక్తి కరమైన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వం లో స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమం తీసుకున్నామన్నారు మంత్రి కేటిఆర్. 2500 మెట్రిక్ టన్నుల నుండి 6500 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు కలెక్ట్ చేస్తున్నారని.. 4500 స్వచ్ఛ ఆటోలను చెత్త కలెక్షన్ కోసం వాడుతున్నామన్నారు మంత్రి కేటిఆర్. కొద్ది రోజుల్లో మరో 500 ఆటోలు రానున్నాయి. దీంతో మొత్తం 5000 ఆటోలు అవుతాయని.. వాహనాల నుండి చెత్త రోడ్ల మీద పడకుండా మోడర్న్ టెక్నాలజీతో ఈ వాహనాలను తీసుకున్నామమన్నారు వెల్లడించారు మంత్రి కేటిఆర్.
17 ట్రాన్స్ఫర్ స్టేషన్ లను తొందరగా ఆధునికీకరణ చేయాలని.. 95 సెకండరీ కలెక్షన్ పాయింట్ లను ఏర్పాటు చేసుకున్నామని వెల్లడించారు మంత్రి కేటిఆర్. 51మిగతా వాహనాలు వస్తే పరిస్థితి మరింత మెరుగు అవుతుందని.. 24 మెగావాట్ల సామర్ధ్యం ఉన్న విద్యుత్ ప్లాంట్ ను జవహర్ నగర్లో ప్రారంబించుకున్నామని స్పష్టం చేశారు మంత్రి కేటిఆర్. చెరువుల్లో పెరిగే గుర్రపు డెక్కను తొలగించడానికి 6 ప్లోటింగ్ ట్రాష్ కలెక్టర్ లను ప్రారంబించుకున్నామని వివరించారు తెలంగాణ రాష్ట్ర ము న్సి పల్ మ రి యు ఐ టీ శాఖ మంత్రి వర్యులు కేటిఆర్. తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే చాలా వరకు అభివృద్ధి చెందిందని.. మరింతగా అభివృద్ధి కావాలంటే.. ప్రజలందరూ టీఆర్ఎస్ పార్టీ వైపునే ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు.