వివేకా హత్య జగనే చేయించాడేమో?- అల్లుడి వాంగ్మూలం!
2019 ఎన్నికల్లో గెలిచేందుకు జగనే వివేకా హత్యకు ప్లాన్ చేసి ఉంటారని తాను భావిస్తున్నట్టు వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి సీబీఐకి తెలిపారు. ఈ మేరకు ఆయన వాంగ్మూలం ఇచ్చినట్టు కొన్ని పత్రికల్లో కథనాలు వచ్చాయి. అంతే కాదు.. 2019 ఎన్నికలకు ముందు జగన్ పై కోడి కత్తి దాడి జరిగిందని.. ఆ దాడిలో జగన్కు చికిత్స చేసిన వైద్యులకు ఆ తర్వాత మంచి పదవులు దక్కాయని.. ఈ ఘటనను రాజకీయంగా వాడుకున్నట్టు.. వివేకా హత్య ఘటనను కూడా రాజకీయంగా వాడుకునేందుకు జగన్ చేయించి ఉంటాడని తాను భావిస్తున్నట్టు వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి తన వాంగ్మూలంలో తెలిపారు.
అయితే వివేకా హత్య విషయంలో మొదట్లో మేం కుటుంబ సభ్యులను అనుమానించలేదని.. అలా చేసి ఉంటే.. జగన్, అవినాష్ రెడ్డి ఎన్నికల్లో ఓడిపోయేవారని వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. వివేకా హత్య తర్వాత కేసు విచారణకు సంబంధించి ఏం చేసినా.. ఏం చెప్పినా.. సజ్జల రామకృష్ణారెడ్డికి చెప్పాలని జగన్ భార్య భారతి తమకు సూచించారని వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి తెలిపారు.
వివేకా హత్య జరిగిన రోజు కూడా టీడీపీ నాయకులపై జగన్ అనుమానం వ్యక్తం చేయడం తమకు నచ్చలేదని వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి తన వాంగ్మూలంలో తెలిపారు. ఆ విషయాన్ని తాను జగన్కు అప్పుడే చెప్పాలనని ఆయన వాంగ్మూలంలో తెలిపారు. ఇప్పుడు వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి వాంగ్మూలం ఎలాంటి కలకలం సృష్టిస్తుందో చూడాలి.