బంపర్ ఆఫర్.. డిస్కౌంట్ లో ఇళ్ళు?

praveen
సొంతింటి కలను సాకారం చేసుకోవాలనే ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే సంపన్నులు డబ్బులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఎంతో సులభంగా సొంతింటి కలను నెరవేర్చుకుంటారు. కానీ సామాన్యులు మాత్రం ఇక్కడ ఎన్నో ఏళ్ల పాటు కష్టపడి సొంతింటి కలను సాకారం చేసుకోవాలని భావిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. సొంతంగా ఇల్లు కొనుక్కోవాలి అనుకునేవారికి ఇప్పుడు ఒక బంపర్ ఆఫర్ అందుబాటులో ఉంది. హైదరాబాద్ లో రాజీవ్ స్వగృహ పథకం లో భాగంగా నిర్మించిన ఇళ్ల పై హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ సంచలన ప్రకటన విడుదల చేసింది. రాజీవ్ స్వగృహ వేలానికి సంబంధించి నోటిఫికేషన్ను విడుదల చేసింది హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ.

 బండ్లగూడా, నాగోల్ సహా భావన టౌన్షిప్ 15వ టవర్ లో మొత్తం 2246 ఇల్లు అమ్మకానికి ఉన్నాయి అంటూ హైదరాబాద్ మెట్రోపాలిటన్ డోవలప్ మెంట్ అథారిటీ తెలిపింది. ఇక ఇందులో చదరపు గజం ధర 2200 రూపాయలు గా నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే ఖమ్మం జిల్లా పోలేపల్లిలో జలజ టౌన్షిప్ ఎనిమిదవ టవర్ లో ఏకంగా 576 ఇల్లు అమ్మకానికి సిద్ధంగా ఉండటం గమనార్హం. ఇక్కడ చదరపు గజం ద్వారా 1500 నుంచి 2000 రూపాయల వరకు అధికారులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకొనడానికి ఆసక్తి కలిగినవారు మార్చి 22వ తేదీ వరకు అవకాశం ఉంది అంటూ హెచ్ఎండిఏ తెలిపింది.

 కేవలం రిజిస్ట్రేషన్ ఫీజు మాత్రమే కాకుండా అదనంగా 11800 చెల్లించాల్సి ఉంటుంది అంటూ స్పష్టం చేసింది హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ. ఇక మార్చి 24 వ తేదీన వేలం ఆన్లైన్లో నిర్వహించబోతున్నాము అంటూ హెచ్ఎండీఏ అధికారులు స్పష్టం చేశారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలి అంటూ సూచించారు. ఇక సొంత ఇంటిని కొనుగోలు చేసుకోవాలి అనుకున్న ఎంతోమంది ఇక ఈ అదిరిపోయే ఆఫర్ ను వినియోగించుకొని వేలంలో ఇంటిని కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: