ట్రోలింగ్ పాయింట్ : వీరేహం పెకాహం ను వదలర్రా! మంచు కంచు!

RATNA KISHORE
ఎన్నో ప్ర‌క‌ట‌న‌లు చేసిన మ‌న వీరేహం గారు ఎక్క‌డున్నారో తెల‌వ‌దు కానీ ఆయ‌న మాట‌లు కానీ న‌వ్వులకు కార‌ణం కావ‌డం మాత్రం భ‌లే ఇష్టంగానే ఉంది కొంద‌రికి!ఇండ‌స్ట్రీ అంటే ఏ ఒక్క‌రిదీ కాద‌ని అంద‌రిదీ అని ఇవాళ చెప్పిన మోహ‌న్ బాబు త‌రువాత కాలంలో కూడా ఇదే స్పీడుతో అంద‌రినీ క‌లుపుకుని పోతారా? అన్న‌ది ఓ డౌటు.ఇవి ఎలా ఉన్నా కూడా మంచు కుటుంబాన్ని నిలువ‌రించి ఓ మాట అయినా మాట్లాడ‌డం కుద‌ర‌ని సంద‌ర్భంలో ఇండస్ట్రీకి పెద్ద దిక్కు ఎవ్వ‌రన్న పాయింట్ ద‌గ్గర కొట్లాట న‌డు స్తోంది.ఇదే స‌మ‌యంలో మా అధ్య‌క్షునిగా ఉంటూ విష్ణు ఏం చేయ‌కుండా ఉండ‌డ‌మే పెద్ద విడ్డూరం. అందుక‌నో/ఎందుక‌నో సోష‌ల్ మీడియాకు ఆ రోజు విష్ణు బాబు చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్ అవుతూ అవుతూ కావాల్సినంత స్ట‌ఫ్ అందిస్తూ ఉన్నాయి.ఇక‌పైనా చేసేదేమ‌యినా ఉందా?

ఆ లేఖ ఆ అక్ష‌రం వివాదాలు
సృష్టిస్తుందో లేదా ప‌రిష్క‌రిస్తుందో?
మాట‌లు చెప్ప‌డం సులువు అని మా ఎన్నిక‌లు నిరూపించినంత సులువుగా ఏ ఎన్నిక‌లూ నిరూపించ‌వు.ఆ మాట‌కు వ‌స్తే మం చు విష్ణు ప్యానెల్ చెప్పిన‌న్ని మాట‌లు ఎవ్వ‌రూ చెప్ప‌లేదు.చెప్ప‌లేరు కూడా! ఆఖ‌రికి ఆయ‌న చెప్పిన వీరేహం పెకాహం పంతు లు గురించి అంద‌రికీ తెలిసిందే! క‌నుక వాటి గురించి మ‌నం మాట్లాడుకోవ‌డం క‌న్నా హాయిగా న‌వ్వుకోవ‌డం వారాంతంలో ఎంతో మేలు చేసే ప‌ని! ఇప్పుడు ఏపీ ప్ర‌భుత్వం టికెట్ ధ‌ర‌లు త‌గ్గించి జీఓ ఇచ్చిన నేప‌థ్యంలో చాలా కాలానికి బుల్లి పిట్ట మాధ్య‌మం ద్వారా మంచు మోహ‌న్ బాబు స్పందించి ఇండ‌స్ట్రీ అంతా క‌లిసి క‌దిలి స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించుకుందాం అని ఓ పెద్ద స్టేట్మెంట్ రాశారు. త‌రువాత దానిని పోస్టు చేశారు.ఇక ఈ పోస్టు ఎలాంటి ప్ర‌కట‌న‌లు జారీ చేయిస్తుందో!ఎలాంటి వివాదాలు సృష్టిస్తుందో లేదా ప‌రిష్క‌రిస్తుందో?


లెట్ దెమ్ నో అంకుల్ .....
అబ్బా ఏం చెప్పాడ్రా!
మ‌రో ట్రోలింగ్ పాయింట్ గుర్తుకువ‌స్తాందే!
మా ఎన్నిక‌ల‌ప్పుడు,అవ్వ‌కమునుపు చాలా మాట‌లు చెప్పారు మంచు విష్ణు.అదేవిధంగా ప్ర‌కాశ్ రాజ్.త‌న‌ను గెలిపించ‌లేద‌న్న కోపంతోనో,క‌సితోనో ప్ర‌కాశ్ రాజ్ ఇండ‌స్ట్రీ వైపు పెద్ద‌గా చూడ‌డం లేదు.టికెట్టు రేట్ల త‌గ్గింపుపై పెద్ద‌గా మాట్లాడ‌లేదు.ఇక మా అధ్య క్షుడిగా ఎన్నిక‌యిన విష్ణు కూడా టికెట్ రేట్ల ఇష్యూపై పెద్ద‌గా మాట్లాడిందీ లేదు.స్పందించిందీ లేదు.కానీ ప్ర‌తిరోజూ తాను స‌మ స్య‌ల‌పై మాట్లాడ‌తాను అని మాత్రం ఎన్నిక‌ల వేళ మాట ఇచ్చారు.త‌న‌కు ప్ర‌భుత్వ పెద్ద‌ల‌తో ఉన్న బంధాలు కార‌ణంగా ఇరు తెలు గు రాష్ట్రాల సీఎంల‌తో మాట్లాడి స‌మ‌స్య ప‌రిష్క‌రిస్తాన‌ని మంచు విష్ణు అనేవారు. కానీ ఇప్పుడు సీన్ రివ‌ర్స్ అయిపోయింది. మం చు విష్ణు ఎక్క‌డున్నారో తెలియ‌దు.అదేవిధంగా చిన్న‌,చిన్న ఫంక్ష‌న్ల‌కు రావ‌డం హాడావుడి చేయ‌డం మిన‌హా మా అధ్య‌క్షుడి హో దాలో ఏం చేయ‌డం లేదు. ఇంకా చెప్పాలంటే చేయ‌రు చేయ‌లేరు కూడా! అంత‌టి అస‌మ‌ర్థ‌త ఆయ‌న‌లో ఉంది.దీంతో మంచు వి ష్ణును ఎప్ప‌టిక‌ప్పుడు టార్గెట్ చేస్తూ నెటిజ‌న్లు వివిధ రూపాల్లో జోకులు పేల్చుతున్నారు.ఇక ట్రోలింగ్ ఆగేలా లేదు లేదండి...నిద్రొస్తే బజ్జోండి .....

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: