సోమన్నా... ఎందుకంత వైరాగ్యం...!
తొలి నుంచి బీజేపీలోనే కొనసాగుతున్న సోము వీర్రాజు... అటు చంద్రబాబుపై కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. తనకు గతంలో చంద్రబాబు రాజమండ్రి ఎమ్మెల్యే టికెట్ ఆఫర్ చేశారని... అలాగే మంత్రి పదవి కూడా ఇస్తానన్నారు సోము వీర్రాజు. అయితే తాను మాత్రం బీజేపీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నామన్నారు. భవిష్యత్తులో రాష్ట్రాని కేవలం బీజేపీ మాత్రమే పాలించగలదని కూడా జోస్యం చెప్పారు సోము వీర్రాజు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వీర్రాజు మాటల వెనుక వ్యూహాత్మక ఎత్తుగడులు ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. మరో ఏడాదిలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని ఇప్పటికే రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. దీంతో ప్రజల్లో మరింత సానుభూతి పొందేందుకు సోము వీర్రాజు ఈ ప్రకటన చేసి ఉంటారని అభిప్రాయం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ సహకారంతో ఎమ్మెల్యే కోటాలో శాసనమండలికి ప్రాధాన్యత వహించారు సోము వీర్రాజు. అటు పార్టీలో దూకుడు కలిగిన నేతగా కూడా ప్రస్తుతం వీర్రాజు గుర్తింపు పొందారు కూడా. పార్టీలో కీలక నేతగా కూడా ఎదిగారు వీర్రాజు. ఇలాంటి సమయంలో రాజకీయ వైరాగ్యం ఎందుకూ అని అంతా ప్రశ్నిస్తున్నారు.