ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. ఇప్పటికే భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉంది అంటూ విపక్షాలు ఆందోళన చేస్తున్నాయి కూడా. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతం పీకల్లోతు అప్పుల్లో ఉంది. ఇంకా చెప్పాలంటే దాదాపు ఊబిలో కూరుకుపోయి ఉంది. ఏ వైపు చూసినా కూడా అ్పులు మాత్రమే కనిపిస్తున్నాయి. సంక్షేమాల కోసం ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది. అదే సమయంలో ఆదాయం మాత్రం ఆ స్థాయిలో రావడం లేదు. ఇప్పటికే రుణ పరిమితి దాటి పోయిందని రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా హెచ్చరికలు కూడా జారీ