ఎన్టీఆర్ బాటలో చంద్రబాబు... అవమానంపై పోరాటం..!
అసెంబ్లీలో తనకు జరిగిన అవమానానికి ప్రజలంతా అండగా ఉండాలంటూ ఇప్పటికే చంద్రబాబు పిలుపు ఇచ్చారు కూడా. తన నిజాయితీ ఏమిటో ప్రజా క్షేత్రంలోనే తేల్చుకుంటామన్నారు. అంటే... ప్రజల్లోకి వెళ్లడం ఖాయమనే మాట చెప్పకనే చెప్పేశారు చంద్రబాబు. అయితే అది ఎలా ఉండబోతోంది అనేది ఇప్పుడు అందరి మదిలో ఉన్న ప్రశ్న. గతంలో వరుసగా రెండు సార్లు ఓడిన తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చేందుకు కూడా చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాదయాత్ర చేపట్టారు కూడా. అది 2012లో దాదాపు 2 వేల 500 కిలోమీటర్ల దూరం నడిచారు. పదేళ్ల క్రితం కావడం... అప్పట్లో చంద్రబాబు వయసు 60 పదుల్లో మాత్రమే ఉండేది. దీంతో పెద్ద సమస్యలు ఏమి రాలేదు. కానీ ప్రస్తుతం ఆయనకు 75 ఏళ్ల వయసు దాటేసింది. ఈ వయసులో పాదయాత్రలు చేయడం ఆరోగ్యానికి అంత మంచిది కాదనేది పార్టీ ముఖ్యనేతల సూచన. కుదిరితే పాదయాత్ర.. లేదంటే బస్సు యాత్ర చేపట్టాలని పార్టీ నేతలకు చంద్రబాబు సూచిస్తున్నారు. ఇదే సమయంలో పార్టీ కార్యకర్తలు కూడా ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు ఆదేశించారు.