విజయసాయికి మంత్రి ఫుల్ సపోర్ట్... ఆయన చాలా మంచోడు...?
అమరావతి పై దుష్ప్రచారం చేస్తున్నారు వారికి అన్యాయం జరగనివ్వం అని ఈ సందర్భంగా స్పష్టం చేసారు. టీడీపీ నేతలు పోలవరం, స్టీల్ ప్లాంట్, మోడీ పై ఒక్క మాట ఎందుకు మాట్లాడడం లేదు అని ఈ సందర్భంగా నిలదీశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము అని అన్నారు. గంగవరం పోర్టు వలన గత 5 ఏళ్ళకు గానూ 80 కోట్లు మాత్రమే వచ్చాయి అని అన్నారు అవంతి. గంగవరం పోర్టు విషయంలో తమకు ఏ విధమైన దురాలోచన కూడా లేదు అని ఆయన స్పష్టం చేసారు.
టీడీపీ ఎమ్మెల్యే ఒకరు స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామా చేశారు అన్న అవంతి శ్రీనివాస్ దానిపై టీడీపీ వైఖరి ఏమిటి? అని ఈ సందర్భంగా నిలదీశారు. సింహాచలం భూములు పై అశోక్ గజపతి బాద్యతరహితగా మాట్లాడారు అని మండిపడ్డారు. అదే విధంగా విజయ సాయి రెడ్డి తో సహా వైసీపీ నేతలు ఎవరూ కూడా భూ కబ్జాలకు పాల్పడలేదు అని ఈ సందర్భంగా స్పష్టం చేసారు. ఆధారాలు ఉంటే చూపండి అంటూ అవంతి శ్రీనివాస్ ఈ సందర్భంగా సవాల్ చేసారు.