"ఈల్ నది" లో శవాలుగా “భారత ఎన్నారై” కుటుంభం
ఎట్టకేలకి తప్పిపోయిన భారత
ఎన్నారై కుటుంభాన్ని గుర్తించారు పోలీసులు..ఈల్ నదిలో ప్రమాద వశాత్తు
కొట్టుకుపోయిన భారత్ కి చెందిన ఎన్నారై కుటుంభం శవాలుగా మారి కనిపించారు..కొన్ని
రోజుల క్రితం మెరూన్ హోండా పైలట్ కారు లో ప్రయాణం చేస్తూ ప్రమాదవశాత్తు కనిపించకుండా
పోయారు అనే వార్త అందరికీ తెలిసిందే అయితే వారు బ్రతికి ఉంటే బాగుంటుంది ఎంతో మంది
ఎన్నో ప్రార్ధనలు కూడా చేశారు కానీ
అప్పటి నుంచీ గాలిపు చెర్యలు చేపట్టిన పోలీసు అధికారులకి ఆ కుటుంభం శవాలుగా కనిపించారు.సందీప్ తోటపల్లి , ఆయన భార్య సౌమ్య ఇద్దరు పిల్లలు సిద్ధాంత్, సాచి లు పోర్ట్లాండ్ నుంచి శాన్జోష్ వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న మెరూన్ హోండా పైలట్ కారు ప్రమాదవశాత్తూ ఈల్ నదిలో పడిపోయింది...తమ భందువుల ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది..ఆ రోజు నుంచీ అదే నదిలో వెతుకుతూ ఉన్నారు
ఈ సంధర్భంలో గత వారం సందీప్ భార్య సౌమ్య మృతదేహాన్ని వెలికి తీశారు. సోమవారం మరో రెండు మృతదేహాలను సహాయక సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు.అయితే ఆరెండు మృతదేహాలు సందీప్ అతని కూతురు సాచివిగా గుర్తించారు అయితే సందీప్ కుమారుడు ఆచూకీ ఇంతా తెలియరాలేదని పోలీసులు తెలిపారు..