మాయదారి జ్వరం.. పాపం అతను 62 ఏళ్లుగా మెలుకునే ఉన్నాడు?

praveen
ప్రతి మనిషికి జీవితంలో నీరు ఆహారం అనేది ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే ఒకటి రెండు రోజులు నీరు ఆహారం తీసుకోకపోతే ఏకంగా ప్రాణం పోయినంత బాధ కలుగుతూ ఉంటుంది. అయితే నీరు ఆహారంతో పాటు అటు సరైన నిద్ర కూడా మనిషికి అవసరం. ఇక నిద్ర లేకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరు కూడా కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటల పాటు ప్రతిరోజు నిద్రపోవాలని డాక్టర్లు సూచిస్తూ ఉంటారు. అయితే ఒక్కరోజు నిద్రపోకపోయిన కూడా ఎంత అలసటగా అనిపిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

 ఏ పని చేయాలన్నా ఓపిక ఉండదు.. ఇక మొత్తం నీరసంగా మారిపోతూ ఉంటుంది అని చెప్పాలి. అయితే ఇలా ఒక్కరోజు నిద్ర లేకపోతేనే పరిస్థితి ఇలా ఉంటుంది. అలాంటిది రెండు మూడు రోజులు కనీసం కంటిమీద కునుకు లేకుండా మేలుకుని ఉంటే వామ్మో ఆ ఆలోచన తట్టుకోలేం. కానీ ఇక్కడ ఒక వ్యక్తి నిద్రపోవడం లేదట. నిద్రపోవడం లేదు అంటే ఏదో ఒకటి రెండు రోజులు అనుకునేరూ.. ఏకంగా 62 ఏళ్లుగా అతను కంటిమీద కునుకు లేదట. ఒక్కరోజు కూడా అతను నిద్రపోలేదట. వినడానికే విచిత్రంగా ఉంది కదా.. కానీ ఇది నిజంగానే జరిగింది. వియత్నాంకు చెందిన వ్యక్తి ఇలా ఏకంగా 62 ఏళ్లుగా నిద్ర లేకుండానే బ్రతికేస్తూ ఉన్నాడట.

 రాత్రి పగలు అనే తేడా లేకుండా అతను మేలుకొనే ఉంటాడట. థాయ్ ఎన్ గాగ్ అనే 80 ఏళ్ల వ్యక్తి 62 ఏళ్లుగా నిద్రపోవట్లేదట. 1962లో ఓసారి అతనికి జ్వరం వచ్చింది. అయితే జ్వరం నుంచి కోలుకున్న తర్వాత అతనికి పూర్తిగా నిద్ర పట్టడం ఆగిపోయిందట. ఇదే విషయంపై అతను వైద్యులను సంప్రదిస్తే అది ఇన్ఫోమేనియా అని వైద్యులు తెలిపా.రు అయితే దీనికి ఎన్ని హాస్పిటల్ల చుట్టూ తిరిగినా అతనికి పరిష్కారం లభించలేదు. క్రమక్రమంగా అతను నిద్ర లేకుండా బ్రతకడానికి అలవాటు పడిపోయాడు. అయితే నిద్ర లేకపోతే ఆరోగ్య సమస్యలు వస్తాయి. కానీ అతనికి 62 ఏళ్లతో నిద్ర పోకపోయినా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావడం లేదట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: