అమెరికాలో తెలుగు ఎన్నారై కాల్చివేత

VALIVETI HARI KRISHNA
మహబూబ్‌ నగర్: అమెరికాలో దారుణం జరిగింది. అమెరికాలోని న్యూజెర్సీలో తెలుగు ఎన్నారైని దుండగులు కాల్చి చంపారు. ఈ సంఘటన నిన్న జరిగినట్లు ఆయన కుటుంబ సభ్యులకు శనివారం ఉదయం సమాచారం అందింది. తెలుగు ఎన్నారై ద్యేపా అర్జున్ రెడ్డిని దుండగులు కాల్చి చంపారు. అర్జున్ రెడ్డి చాలా కాలంగా అమెరికాలో ఉంటున్నారు. ఆయనకు 52 ఏళ్ల వయస్సు. సొంతంగా ఫార్మసీ షాపు నడుపుతున్నాడు అర్జున్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం మాదారం గ్రామానికి చెందినవారు. కేంద్ర మంత్రి ఎస్. జైపాల్ రెడ్డికి ఆయన దూరపు బంధువని చెబుతున్నారు. ఆయన గత ఎన్నికల్లో మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి శాసనసభా నియోజకవర్గం టికెట్ కోసం ప్రయత్నాలు చేశారు. ఓ నెల రోజుల్లో ఆయన స్వస్థలానికి రావాల్సి ఉందని చెబుతున్నారు. నల్లజాతీయులే అర్జున్ రెడ్డిని కాల్చి చంపినట్లు అనుమానిస్తున్నారు. వివరాలు అందాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: