హమ్మయ్య! ఎట్టకేలకు బాహుబలి..?!!

Edari Rama Krishna

ఎప్పుడెప్పుడా అని కళ్లకు వత్తులు వేసుకొని చూస్తున్నారు తెలుగు ప్రేక్షకులు జక్కన చెక్కిన చిత్ర రూపం చూద్దామని. అదే నండి ప్రభాస్ హీరోగా, హిట్ చిత్రాల దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం బాహుబలి.

ఎట్టకేలకు ఈ సినిమా మే 15న విడుదల కాబోతోంది అన్న తీపి కబురు స్వయంగా రాజమౌళీనే ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఒక వీడియోను ఆయన ట్విట్టర్‌ పెట్టారు. అందులో ''మా బాహుబలి టీం అంతా ఎంతో సంతోషంగా ఉంది.

ఒక్క పాట తప్ప, మొత్తం టాకీ పార్ట్ అంతా పూర్తయింది. బాహుబలి మొదటి భాగాన్ని మే 15న విడుదల చేస్తున్నానని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నా'' అని రాజమౌళి ట్వీట్ చేశారు. అమ్మయ్య కనీసం మొదటి బాగం ఇప్పటికైనా విడుదల చేస్తున్నారన్న సంతోషంలో ప్రభాస్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

. .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: