బిగ్ బాస్ హౌస్ లో అందరికీ టార్గెట్ అయినా రొమాంటిక్ జంట..?
అయితే ఆటలో భాగంగా ఇటుకలు పేర్చి ముగ్గురు జంటలు ఆడిన ఆట.. కొట్టుకునే అంత దాకా వెళ్లి పోయింది. ముఖ్యంగా హౌస్ లో ముందు నుండి ప్రాణ స్నేహితులు గా ఉన్నా వరుణ్ సందేశ్ మరియు రాహుల్ మధ్య జరిగిన ఆటలో కొట్టుకునే అంతదాకా వివాదం జరగటం ఎపిసోడ్ కె హైలెట్ గా నిలిచింది. దీంతో తొమ్మిది మంది హౌస్ లో ఉన్న క్రమంలో రొమాంటిక్ జంటగా ముందునుండి హౌస్ లో పేరు ఉన్న రాహుల్ మరియు పునర్నవి లు ఇప్పుడు అందరికీ టార్గెట్ అయినట్లు అయింది. ఈ టాస్క్ ముందు వరకు..వరుణ్ సందేశ్, రాహుల్, వితిక, పునర్నవి ఒక గ్యాంగ్ గా ముందు నుండి హౌస్ లో ఉంటం జరిగింది.
అయితే తాజాగా జరిగిన ఇటుకల ఆటలో మొత్తం ఈ నలుగురు ఒక జంట ఒక వైపు మరొక జంట మరో వైపు ఉండటంతో హౌస్ లోన్ ఇంటి సభ్యులు అంతా రాహుల్ మరియు పునర్నవి లను టార్గెట్ చేస్తూ వరుణ్ సందేశ్, వితిక కి సపోర్ట్ చేస్తూ బిగ్ బాస్ హౌస్ లో సరికొత్త వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఇటువంటి క్రమంలో గురువారం జరిగిన ఎపిసోడ్లో చివరిలో అలీ రేజా ఎంట్రీ ఇవ్వడంతో ఇప్పుడు హౌస్ సభ్యులంతా ఒక్కసారిగా షాక్ తిన్నారు. వైల్డ్ కార్డు రూపంలో అదిరిపోయే రీతిలో బిగ్ బాస్ హౌస్ లోకి అలీ రేజా ఎంట్రీ ఇవ్వటం జరిగింది. దీంతో హౌస్లో ఎవరికి వారు వేసుకున్న స్ట్రాటజీ లు ఒక్కసారిగా తలకిందులు అయినట్లే అని చాలామంది అలీ రేజా ఎంట్రీ పై సోషల్ మీడియా లో కామెంట్ చేస్తున్నారు. మొత్తం మీద బిగ్ బాస్ సీజన్ 3 ఇప్పుడు టెలివిజన్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది.