ఇళయ దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ బిగిల్. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈచిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. ప్రమోషన్స్ లో భాగంగా ఈ చిత్రం యొక్క ఆడియో వేడుకను ఈనెల 19న భారీ స్థాయిలో నిర్వహించనున్నారు. దాంతో తమ అభిమాన హీరో సినిమా ఈవెంట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు విజయ్ ఫ్యాన్స్. ఇక పాసులు దొరికిన వారు ఈ ఈవెంట్ ను టీవీ లోనైనా చూద్దాం అనుకున్నారు కానీ ఇప్పుడు వారికీ నిరాశే ఎదురైంది. ఎందుకంటే ఆ ఈవెంట్ ను అనివార్యకారణాలవల్ల ప్రత్యక్ష ప్రసారం చేయడం లేదని నిర్మాతలు ప్రకటించారు. అయితే ఫ్యాన్స్ కు ఊరట కలిగించే విషయం ఏంటంటే ఈనెల 22న సన్ టీవీలో సాయంత్రం ఈ ఆడియో వేడుక ప్రసారం కానుంది. ఇక గతంలో సర్కార్ ఆడియో వేడుక కూడా గ్రాండ్ గా జరుగగా అందులో విజయ్ సుదీర్ఘ ప్రసంగం ఫ్యాన్స్ ను ఉర్రుతలూగించింది. దాంతో విజయ్ ఈ సారి కూడా అలాంటి ప్రసంగాన్నే ఇవ్వడానికి రెడీ అవుతున్నాడట.
అట్లీ డైరెక్షన్ లో స్పోర్ట్స్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ చిత్రం లో విజయ్ డ్యూయెల్ రోల్ లో కనిపించనున్నాడు. భారీ బడ్జెట్ తో ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్ ఈచిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటిస్తుండగా ఏ ఆర్ రహెమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో భారీ అంచనాల మధ్య దీపావళి కానుకగా విడుదలకానుంది. తెలుగులో ఈ చిత్రాన్ని మహేష్ కోనేరు విడుదలచేయనున్నాడు. కాగా అట్లీ -విజయ్ కాంబినేషన్ లో ఇది మూడో సినిమా. ఇంతకుముందు వీరి కలయికలో వచ్చిన తెరి , మెర్సల్ చిత్రాలు బ్లాక్ బాస్టర్ విజయాలను సాధించాయి.