బిగ్ బాస్ షోలో ఈరోజు ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే...?

Reddy P Rajasekhar
20 రోజుల క్రితం నాగార్జున హోస్ట్ గా ప్రారంభమయిన బిగ్ బాస్ షో తెలుగు ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంటోంది. బిగ్ బాస్ షోలో మొదటివారం సినీ నటి హేమ ఎలిమినేట్ కాగా రెండవ వారం టీవీ9 జర్నలిస్ట్ జాఫర్ ఎలిమినేట్ అయ్యారు. ఈ వారం ఎలిమినేషన్ కు ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రి, పునర్నవి భూపాళం, సింగర్ రాహుల్ సిప్లిగంజ్, నటి వితికా షేరు, డ్యాన్స్ మాస్టర్ బాబా భాస్కర్ నామినేట్ అయ్యారు. 
 
నిన్నటి ఎపిసోడ్లో హోస్ట్ నాగార్జున గారు ఈ ఐదుగురు ఇంటి సభ్యుల సూట్ కేసులు స్టోర్ రూమ్లో ఉంచమని ఇంటిసభ్యులకు చెప్పారు. ఈ ఐదుగురు ఇంటి సభ్యులలో ఎవరి సూట్ కేస్ అయితే ఉండదో వారు ఈ వారం ఎలిమినేట్ అవుతారని నాగార్జున ప్రకటించారు. నిన్నటి ఎపిసోడ్లో హోస్ట్ నాగార్జున ఏ ఒక్కరినీ సేవ్ చేయలేదు. అనధికారిక పోల్స్ ప్రకారం, తెలుస్తున్న సమాచారం మేరకు ఈ వారం తమన్నా సింహాద్రి ఎలిమినేట్ అవుతున్నట్లు తెలుస్తుంది. 
 
మొదటి రెండు మూడు రోజులు తమన్నా సింహాద్రి ప్రవర్తన బాగానే ఉన్నప్పటికీ గత వారం టాస్క్ సమయంలో అలీ రేజాపై ఇష్టం వచ్చినట్లుగా వ్యాఖ్యలు చేసింది తమన్నా సింహాద్రి. ఈ వారం సీరియల్ నటుడు రవికృష్ణ ఎలిమినేషన్ కు నామినేట్ చేయటంతో రవికృష్ణను ఒక రోజంతా టార్గెట్ చేసి మాట్లాడింది తమన్నా. బిగ్ బాస్ హౌస్లోని మిగతా సభ్యులు అలా మాట్లాడవద్దని ఎంత వారించినా తమన్నా సింహాద్రి మాత్రం వినలేదు. 
 
శివజ్యోతిని కూడా తమన్నా సింహాద్రి శివ జ్యోతి బయట ఒకలా ఉండేదని ఇంట్లో మరోలా ఉందని వ్యాఖ్యలు చేసింది. బిగ్ బాస్ షోలో తమన్నా సింహాద్రి ప్రవర్తన బిగ్ బాస్ ఇంటి సభ్యులతో పాటు ప్రేక్షకులకు కూడా చిరాకు తెప్పించే విధంగా ఉంది. ఈ వారం బాబా భాస్కర్ కు ఎక్కువ శాతం ఓట్లు రాగా తమన్నా సింహాద్రికి చాలా తక్కువ శాతం ఓట్లు వచ్చినట్లు తెలుస్తుంది. అందువలన ఈ వారం బిగ్ బాస్ షోలో తమన్నా సింహాద్రి ఎలిమినేట్ అయినట్లు సమాచారం. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: