'మన్మథుడు' , నాగార్జున కెరీర్ లో కల్ట్ సినిమాగా మిగిలిపోయింది. ఇప్పటికి ఈ సినిమా టీవీ లోవస్తే మినిమమ్ టీఆర్పీ రేటింగ్స్ ను రాబట్టుకుంటుంది. అంతలా ఈసినిమా కు ఫ్యాన్స్ వున్నారు. దాంతో నాగార్జున నటించిన తాజా చిత్రం మన్మథుడు 2 ఫై సహజంగానే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఈసినిమా , మన్మథుడు సినిమాకు సీక్వెల్ కాదని నాగ్ ముందునించి చెబుతూనే వస్తున్నాడు. అయినా ప్రేక్షకులు ఆ సినిమా లాగే మంచి ఎంటర్ టైనింగ్ గా ఉంటుందనుకున్నారు.
కానీ ఈరోజు ప్రేక్షకులముందుకు వచ్చిన ఈచిత్రం దారుణమైన రేటింగ్స్ ను సొంతం చేసుకుంది. సినిమా అంతా డబల్ మీనింగ్ డైలాగ్సే వున్నాయి తప్ప ప్రాపర్ స్టోరీ లేదని మన్మథుడు అనే క్లాసిక్ టైటిల్ వాడి ఆ సినిమా పరువు తీశారని సోషల్ మీడియా లో కామెంట్స్ వస్తున్నాయ్. అయితే నిర్మాత గా నాగార్జున ఏంటో గతంలో ఆయన నిర్మించిన సినిమాలే చెప్తాయి. దాదాపుగా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో వచ్చిన సినిమాలు అన్ని సూపర్ హిట్ అయ్యాయి.
అయితే ఈ మన్మథుడు 2 విషయంలో మాత్రం నాగ్ అంచనా దారుణంగా ఫెయిల్ అయ్యింది. అసలు ఇలాంటి స్టోరీ ని ఆయన ఎందుకు సెలక్ట్ చేసుకున్నాడో ఇప్పుడు అయన అభిమానులకు అర్ధం కానీ పరిస్థితి. బహుశా డబల్ మీనింగ్ డైలాగ్సే సినిమాను కాపాడుతాయనుకోవచ్చు నాగార్జున. కానీ అవి కథలో కలిసి సందర్బానుసారం వస్తే ఓకే కాని వాటికీ కోసమే సినిమా తీస్తే ఫలితం ఇలాగే ఉంటుంది. ఇక ఎట్టకేలకు మజిలీ తో నాగ చైతన్య బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టి ఫ్యాన్స్ ను ఆనందింపజేస్తే తాజాగా మన్మథుడు 2 రూపంలో వారికీ గట్టి షాక్ ఇచ్చాడు నాగార్జున.