ప్రపంచ వ్యాప్తంగా మంచి హైప్ తెచ్చుకున్న బిగ్బాస్ రియాలిటీ షో మొదటి వారం పూర్తి చేసుకుంది. రెండో వారంలో అడుగుపెట్టిన ఈ షోలోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా తమన్నా సింహాద్రిని నాగార్జున ఆహ్వానించారు. స్టేజ్ మీదకు రావడంతోనే తాను మాత్రం బిగ్ బాస్ హౌజ్లో ఇరగదీస్తానని, ఫైనల్ వరకు ఉంటానని తమన్నా చాలా కాన్ఫిడెంట్గా చెప్పింది. తమన్నా మల్లెపూల గుబాలింపుతో వయ్యారాలు ఒలకబోస్తూ అదిరిపోయేలా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చింది.
వారం రోజులు లేటుగా వెళ్లిన తమన్నా ఇప్పటికే టెలికాస్ట్ అయిన బిగ్ బాస్ ఎపిసోడ్ లను చూసిన నేపథ్యంలో మంచి ప్లానింగ్తో హౌస్లో ఎంట్రీ ఇచ్చింది. ఇక వచ్చీ రావడంతోటే గేమ్ మొదలు పెట్టింది తమన్నా. తాను బాబా భాస్కర్, జాఫర్ టీంతో ఉంటానని చెప్పింది. అలాగే హౌస్ అక్కడ విషయాలు ఇక్కడ.. ఇక్కడ విషయాలు అక్కడ చెబుతూ కొందరిని టార్గెట్ చేసింది. ఇక హౌస్లో మహేష్ విట్టాతో వరుణ్, వితికాలు వ్యవహరించిన తీరు తనకు నచ్చలేదని.. అసలు మహేష్ వాళ్లకు సారీ చెప్పాల్సిన అవసరం లేదని.. వరుణ్ ప్రవర్తన తనకు నచ్చలేదని బాబా భాస్కర్, జాఫర్, మహేశ్, అలీరెజా, శ్రీముఖిలతో గ్రూపు డిస్కషన్లు చేస్తుంది.
అలాగే మరో పక్క కొందరితో ఓ గ్రూప్ ఫాం చేస్తుంది. ఇది గమనించిన వరుణ్ సందేశ్ తనకు మహేశ్ కు గొడవ పెట్టాలని తమన్నా చూస్తుందని రాహుల్ తో వరుణ్ చెప్పటం విశేషం. మరియు ఎలిమినేషన్ విషయంలో కూడా తమన్నా ఇప్పటికే హౌస్ లో జరిగిన విషయాలపై తనకున్న అవగాహనతో వరుణ్, వితికాను టార్గెట్ చేసి నామినేట్ చేసింది. ఇక వచ్చి రాగానే ఓ గ్రూప్ కట్టడానికి ట్రై చేస్తునట్టు కనిపిస్తోంది. రసవత్తరంగా సాగుతున్న బిగ్బాస్ తమన్నా రాకతో మరింత రక్తి కట్టిస్తోంది.