డిస్ట్రిబ్యూటర్ నుంచి నిర్మాతగా ఎదిగిన దిల్ రాజు.. తన కెరీర్లో అనేక సినిమాలను నిర్మించాడు. ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్నాడు. ఒకవైపు తనకు కలిసి వచ్చిన డిస్ట్రిబ్యూషన్ ను నిర్వహిస్తూనే నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రభాస్ హీరోగా చేస్తున్న సాహో సినిమాకు నైజాం, ఉత్తరాంధ్ర హక్కులను 45 కోట్లకు కైవసం చేసుకున్నారు.
ప్రభాస్ తో సినిమా చేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాడు. ప్రభాస్ తో మున్నా, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలు చేశారు. ఇందులో మున్నా ఫెయిల్ కాగా, మిస్టర్ పర్ఫెక్ట్ సూపర్ హిట్ కొట్టింది. ఇప్పుడు ప్రభాస్ తో సినిమా చేయాలి అంటే అది సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు.
అప్పట్లో 25 కోట్ల రూపాయల బడ్జెట్ లో సినిమా పూర్తయ్యేది. కానీ, ఇప్పుడు ప్రభాస్ రేంజ్ పెరిగిపోయింది. ప్రభాస్ తో సినిమా చేయాలి అంటే కనీసం 200 కోట్ల రూపాయల బడ్జెట్ ఉండాలి. ఇది భారీ బడ్జెట్. అంత సాహసం దిల్ రాజు చేయగలుగుతాడా..?
అయితే, ఇటీవల ప్రభాస్ కు దిల్ రాజు టీమ్ ఓ మంచి కథ వినిపించారని.. బాగుంది చేద్దామని ప్రభాస్ చెప్పినట్టు తెలుస్తోంది. ప్రభాస్ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకొని సినిమా చేయాలి. అంటే కనీసం 150 నుంచి 200 కోట్ల రూపాయల బడ్జెట్ కావాలి. అంత బడ్జెట్ ను ప్రభాస్ పెట్టగలుగుతాడా ఇప్పుడు. ఏమో చూద్దాం.