ఆడియో ఫంక్షన్ కి వచ్చి పకోడీ తిని షాక్ ఇచ్చిన చిరంజీవి..!

KSK
మెగాస్టార్ చిరంజీవి క్రేజే వేరు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం సినిమాలను స్లో గా చేస్తు ఒకపక్క రాజకీయంగానూ కామ్ గా ఉంటూ ... సామాజికంగా బిజీ అవుతున్న చిరంజీవి ఇటీవల ఇండస్ట్రీలో జరిగిన ఓ ఆడియో ఈవెంట్ కి వచ్చి పకోడీ తిని అందరికి షాక్ ఇచ్చారు. అసలు మామూలుగా చిరంజీవి సినిమాకి సంబంధించిన కార్యక్రమాలలో పాల్గొన్న గాని ఎక్కడ ఏమి తిన్నారు అని చాలామంది ఇండస్ట్రీకి చెందిన వారు అంటారు.


అయితే తాజాగా ఇటీవల ఆర్.నారాయణమూర్తి నటించిన ‘మార్కెట్లో ప్రజాస్వామ్యం’ ఆడియో వేడుకకు విచ్చేసిన చిరంజీవి ఆడియో వేడుకలో ఆర్ నారాయణ మూర్తి గురించి మరియు ఆయనకు సమాజం పై ఉన్న అవగాహన గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఎంతో ఆసక్తికరంగా అభిమానుల మధ్య జరిగిన ఈ ఆడియో వేడుకలో ఆర్ నారాయణ మూర్తి కూడా చిరంజీవి గారి గురించి ఎన్నో విషయాలను తెలియ చేశారు.


అయితే ఈ ఆడియో వేడుక అయిన వెంటనే చిరంజీవి ఆర్ నారాయణ మూర్తి తో కలిసి 'పాకోరస్'ను తినడం అందరికీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే వీటికి సంబంధించిన పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. ఈ పిక్స్ చూసిన మెగా అభిమానులు చిరంజీవి పై రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు..సింపుల్సిటీ కేరాఫ్ అడ్రస్ మెగా ఫ్యామిలీ అంటూ షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: