ఫోని బాధితులకు అక్షయ్ సహాయం.

Krishna
ఫొని తుపాను ఎంతటి భయంకరాన్ని సృష్టించిందో అందరికి తెలిసిందే, కోస్తా ఆంధ్రా..ఒడిస్సా కేంద్రంగా నెలకొన్న ఈ తుఫ్ఫాను  కారణంగా ఒడిశాలో సుమారు 34 మంది మృతి చెందగా, కొన్ని వందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. తుపాను వల్ల దెబ్బతిన్న ఒడిశాకు ఇతర రాష్ట్రాలతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలూ బాసటగా నిలుస్తున్నాయి. 

అయితే బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ ఒడిస్సా ప్రజలకు బాసటగా నిలిచారు. ఇందుకోసం ఒడిస్సా ముఖ్యమంత్రి సహాయ నిధికి కోటి రూపాయలు విరాళంగా ఇచ్చాడు. ప్రకృతి విపత్తులు ఎప్పుడు సంభవించిన ప్రజలను ఆదుకునేందుకు అక్షయ్ ఎప్పుడు ముందుంటారు. గతంలో కేరళ, చెన్నైలో తుపాను బీభత్సం సృష్టించినప్పుడు కూడా అక్షయ్ తన వంతు సహాయాన్ని అందచేశారు.

అంతేకాదు "భారత్ కే వీర్‌" వెబ్‌సైట్‌ ద్వారా జవాను కుటుంబాలను కూడా ఆదుకుంటున్నారు. కేవలం తన సినిమాలతోనే కాకుండా ఇలాంటి సేవ కార్యక్రమాలలో కూడా తన వంతు సహాయం అందిస్తూ అక్షయ్ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అక్షయ్ బాటలో ఇంకెంతమంది బాలీవుడ్ స్టార్స్ నిలుస్తారో చూడాలి 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: