మహర్షి ఈవెంట్.. పోకిరి సినిమా మర్చిపోయిన మహేష్..!

shami
సూపర్ స్టార్ మహేష్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో మహేష్ 25వ సినిమాగా వస్తున్న సినిమా మహర్షి. మే 9న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ బుధవారం సాయంత్రం నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో జరిగింది. ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ గా విక్టరీ వెంకటేష్ అటెండ్ అవగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా అతిథిగా వచ్చాడు.


ఇక తన 25వ సినిమా ఎంతో స్పెషల్ గా మారిందని మహేష్ తన స్పీచ్ లో హీరోగా మొదటి సినిమా రాఘవేంద్ర రావు దగ్గర నుండి కృష్ణ వంశీ, త్రివిక్రం, శ్రీను వైట్ల, వంశీ పైడిపల్లి ఇలా అందరి పేర్లు ప్రస్థావించాడు. అయితే అసలు మహేష్ ను సూపర్ స్టార్ చేసిన పోకిరి సినిమా గురించి మర్చిపోయాడు. 


Missed mentioning an important person in my speech today. In my 25 films journey, it was #Pokiri that made me a Superstar. Thank you so much @purijagan !!! Thanks for giving me Pokiri 🤗 A film that will always be remembered.

— Mahesh Babu (@urstrulyMahesh) May 1, 2019
పూరి జగన్నాథ్ డైరక్షన్ లో తెరకెక్కిన పోకిరి సినిమా సంచలన విజయం అందుకుంది. ఆ సినిమాతోనే మహేష్ సూపర్ స్టార్ అయ్యాడు. అయితే స్టేజ్ మీద స్పీచ్ లో పోకిరి మర్చిపోయిన మహేష్ వెంటనే ట్విట్టర్ లో తనని సూపర్ స్టార్ ను చేసిన పోకిరి సినిమా మర్చిపోయాను.. ఆ సినిమా డైరక్టర్ పూరి జగన్నాథ్ క్ థ్యాంక్స్.


నాకు ఎప్పటికి గుర్తుండిపోయే సినిమా పోకిరి అని మహేష్ ట్వీట్ చేశారు. ఏది ఏమైనా మహేష్ పోకిరిని మర్చిఊవడంపై ఫ్యాన్స్ కూడా షాక్ అయ్యారు. మహర్షి సినిమా ఎంజాయ్ మెంట్ లో ఉండి మహేష్ అన్ని సినిమాలను గుర్తుంచుకోవడం కష్టమే కాని పోకిరి నిజంగానే మహేష్ ను స్టార్ చేసిన సినిమా. అది ఎలా మర్చిపోయాడబ్బా అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. 
 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: