వ్యూహాలు మారుస్తున్న విజయ్ దేవరకొండ షాక్ లో టాప్ హీరోలు !

Seetha Sailaja
క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం నటిస్తున్న ‘డియర్ కామ్రేడ్’ షూటింగ్ సమయలో అనుసరిస్తున్న వ్యూహాలు ఏకంగా టాప్ హీరోలకు షాక్ ఇస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. కాకినాడలో ‘డియర్ కామ్రేడ్’ షెడ్యూల్ ముగించుకున్న తరువాత ఈమూవీకి సంబంధించి కొత్తగూడెంలో జరిగిన షెడ్యూల్ లో విజయ్ దేవరకొండ కొత్త వ్యూహాలు బయటపడినట్లు టాక్. 

అక్కడ షూటింగ్ సమయంలో తనను కలవడానికి వచ్చిన అభిమానులతో విజయ్ ఫోటోలు తీయించుకుంటూ మాట్లాడటమే కాకుండా తాను కొన్ని సేవా కార్యక్రమాలు ప్రారంభించబోతున్నానని వాటికి సంబంధించి సలహాలు సూచనలు ఇమ్మని అక్కడకు వచ్చిన అభిమానులను అడగడం షాకింగ్ న్యూస్ గా మారింది. చిరంజీవి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న చిరంజీవి బ్లడ్ బ్యాంక్ మాదిరిగా వృద్దులకు ఎంతమందికి వీలైతే అంతమందికి పోషించే విధంగా ఒక వృద్దాశ్రమం నిర్వహించే ఆలోచనలు ఉన్నట్లు విజయ్ తన అభిమానులకు లీకులు ఇస్తున్నట్లు సమాచారం.

అంతేకాదు ఈ క్రేజీ హీరో బ్రాండ్ ఎండార్స్ మెంట్స్ విషయంలో విజయ్ కొత్తగా అనుసరిస్తున్న వ్యూహాలు ఏకంగా మహేష్ అల్లు అర్జున్ రానా లకు షాక్ ఇస్తున్నట్లు సమాచారం. ఒక ప్రముఖ శీతల పానీయ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడానికి విజయ్ చాల తక్కువ మొత్తానికి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడానికి అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. 

ప్రస్తుతం యూత్ కు ఐకాన్ గా  మారిపోయిన విజయ్ రాబోతున్న సమ్మర్ సీజన్ లో కొన్ని బ్రాండ్స్ కు బుల్లితెర పై ప్రచారం కలిపిస్తు బుల్లితెర ద్వారా ఫ్యామిలీ ఆడియన్స్ కు కూడ కనెక్ట్ అవ్వాలని ప్రయత్నిస్తున్నాడు. గతంలో చిరంజీవి మొదటలు మాస్ హీరోగా మొదలై ఆతరువాత ఫ్యామిలీ ఆడియన్స్ కు కనెక్ట్ అయిన విధంగా విజయ్ అనుసరిస్తున్న వ్యూహాలు ఏకంగా మెగా స్టార్ చిరంజీవి అడుగుజాడలను అనుసరిస్తున్నాడా అంటూ కామెంట్స్ వస్తున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: