500 కు పైగా చిత్రాల్లో నటించి కర్చీఫ్ లు అమ్ముకుంటున్న నటి!

Edari Rama Krishna
ఒకప్పుడు తమిళ సినిమాల్లో ఎన్నో క్యారెక్టర్ పాత్రల్లో కనిపించి..ఇప్పుడు మెరీనా బీచ్ లో కర్చీఫ్ లు అమ్ముకుంటూ జీవన పోరాటం చేస్తున్న ఓ నటి దీన గాద సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 500 కు పైగా చిత్రాల్లో నటించిన రంగమ్మాళ్ వయసు 83..గత కొంత కాలంగా  సినీ పరిశ్రమలో అవకాశాలు లేకపోవడంతో చెన్నైలోని మెరీనా బీచ్ లో కర్చీఫ్ లు విక్రయిస్తూ జీవనం సాగిస్తోంది.  బామ్మ పాత్రలకు పెట్టింది పేరైన ఆమె, హాస్యనటుడు వడివేలుతో కలిసి ఎన్నో చిత్రాల్లో నటించి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. 

అయితే బీచ్ లో తిరుగుతున్న సినీ అభిమానులు ఆమెను గుర్తు పట్టి ఆప్యాయంగా పలకరించి తమకు తోచిన సహాయం చేస్తున్నారు. అయితే అన్ని చిత్రాల్లో నటించి మీకు ఇదేం పరిస్థితి అని కొంత  మీడియా అడుగగా..ఎంజీఆర్ కాలం నుంచే తాను సినిమాల్లో నటిస్తున్నానని..ఎన్నో రకాల పాత్రలు తాను పోషించానని..దాదాపు ఐదు వందల సినిమాల వరకు నటించానని..అయితే తాను సంపాదించిన సొమ్ముతో తన పిల్లలకు చదువు చెప్పించానని..కానీ ఇప్పుడు వాళ్లు తనను పట్టించుకోవడం లేదని..అందుకే బీచ్ లో కర్చీఫ్ లు, ఇతర వస్తువులు అమ్ముకుంటున్నానని ఆవేదన వ్యక్తం చేసింది.

తమిళనాడు ప్రభుత్వం లేదా నడిగర్ సంఘం తనను ఆదుకోవాలని రంగమ్మాళ్ విజ్ఞప్తి చేసింది. కాగా, గత ఏడాదిలో నడిగర్ సంఘం ద్వారా ఆమెకు ఐదు వేల రూపాయల సాయం అందింది. ఫెఫ్సీ అనుసంధాన జూనియర్ ఆర్టిస్టు సంఘంలో రంగమ్మాళ్ సభ్యురాలు.  వాస్తవానికి సినీ జీవితం ఎంతో రంగుల కల అనుకునే వారు ఉంటారు..కానీ ఆ రంగుల కళ వెను ఎన్నో దీన గాధలు కూడా ఉంటున్నాయని రంగమ్మాళ్ చూస్తుంటే అర్థం అవుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: