మాట తప్పిన విజయ్ దేవరకొండ పై రష్మిక ప్రశ్నల పరంపర !

Seetha Sailaja
‘గీత గోవిందం’ మూవీ సూపర్ సక్సస్ తో విజయ్ దేవరకొండ రష్మికల జోడీకి విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఈమూవీ తరువాత వీరిద్దరికీ పెరిగిపోయిన సానిహిత్యం పై అనేక గాసిప్పులు కూడ వచ్చాయి. ఇలాంటి పరిస్థితులలో రష్మిక ట్విట్టర్ వేదికగా విజయ్ దేవరకొండను నిలదీస్తూ అనేక ప్రశ్నలు కురిపించింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ 'మైత్రి మూవీస్' బ్యానర్ నిర్మిస్తున్న ‘డియర్ కామ్రేడ్’ చిత్రంలో రష్మికతో నటిస్తున్న సందర్భంలో తెలంగాణ ఎన్నికల్లో తాను అనుకున్నట్లు ఫలితాలు వచ్చి టిఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తే ‘డియర్ కామ్రేడ్ మూవీ యూనిట్ మొత్తానికి ఒక భారీ డిన్నర్ పార్టీ ఇస్తానని విజయ్ దేవరకొండ మాట ఇచ్చాడట విజయ్ దేవరకొండ.

టీఆర్ఎస్ నేత కేటీఆర్ అభిమాని విజయ్ అన్న విషయం తెలిసిందే. వీరిద్దరి మధ్య ఒక దూరపు చుట్టరికం ఉంది అన్న ప్రచారం కూడ గతంలో జరిగింది. తెలంగాణ శాసన సభ ఎన్నికల ముందు పలు ఇంటర్వ్యూల్లో కేటీఆర్‌ ను ఆయన ఐడియాలజీని ప్రశంసిస్తూ విజయ్ కామెంట్స్ చేశాడు. దీని ద్వారా తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి పరోక్షంగా తన మద్దతు ప్రకటించినట్లు అయింది.  

తెలంగాణ ఎన్నికలు ముగిసి మరోసారి టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా విజయ్ దేవరకొండ తాను ఇచ్చిన మాట మరిచి పోవడంతో రష్మిక ట్విట్టర్ ద్వారా ప్రశ్నించింది. ‘ఎలక్షన్స్ రిజల్ట్ తర్వాత పార్టీ ఇస్తాను అన్నావ్.. ఏమైంది? ఎన్నికల ఫలితాల తర్వాత సెట్లో అందరికీ పార్టీ ఇస్తాను అన్నావ్.... మరిచిపోయావా మిస్టర్ ఫిల్మ్ ఫేర్, రౌడీవేర్ ఓనర్, గూగుల్‌ లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన నటుడా ఎక్కువ మంది గూగుల్ సెర్చ్ చేసిన సినిమాలో కథానాయకుడా’ అంటూ రకరకాల ప్రశ్నలతో సెటైర్లు వేసింది రష్మిక. 

ప్రస్తుతం వీరిద్దరూ కలిసి నటిస్తున్న ‘డియర్ కామ్రేడ్’ మూవీ షూటింగ్  భరత్ కమ్మ దర్శకత్వంలో ప్రస్తుతం శరవేగంగా కర్నాటక ప్రాంతంలో జరుగుతోంది. ‘గీతగోవిందం’ తరువాత విజయ్ దేవరకొండకు ఏర్పడిన క్రేజ్ తో ఈమూవీ స్క్రిప్ట్ లో చాల మార్పులు చేర్పులు చేసినట్లు సమాచారం..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: