ఒకప్పుడు టాలీవుడ్ ని ఏలి ఇప్పుడు కోలీవుడ్లో స్థిరపడిపోయిన ముద్దుగుమ్మ హన్సిక. వాస్తవానికి హన్సిక బాలీవుడ్ లో బాలనటిగా ఎంట్రీ ఇచ్చి తర్వాత పూరి జగన్నాధ్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన ‘దేశముదురు’సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఆ తర్వాత పలు తెలుగు సినిమాల్లో నటించిన హన్సిక తర్వాత తమిళ సినిమాలకే పరిమితం అయ్యారు. ప్రస్తుతం తన 50వ సినిమా లో నటిస్తుంది.
యూఆర్ జమీల్ దర్శకత్వంలో ‘మహా’ అనే సినిమా చేస్తుంది. హీరోయిన్ సెంట్రిక్ సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇందులో హన్సిక డిఫరెంట్ షేడ్స్లో వెరైటీ లుక్లో కనిపిస్తుంది. గతంలో ఎప్పుడు చేయని పాత్రని హన్సిక ఈ సినిమాలో చేస్తుందని అంటున్నారు. ఇందులో విలక్షణ పాత్ర చేస్తున్న హన్సిక ఎమోషన్స్ని అద్భుతంగా పండించనుందట.తాజాగా సినిమా ఫస్ట్ లుక్ లో దొంగ స్వామిగా కనిపిస్తూ, ఓ కుర్చీలో కూర్చుని హుక్కా తాగుతుండటం విమర్శలకు గురవుతోంది.
‘మహా’పోస్టర్ హిందువుల మనోభావాలను కించపరిచేలా ఉందంటూ పీఎంకే పార్టీ కోర్టును ఆశ్రయించడంతో, ఆ పిటిషన్ ను విచారణకు స్వీకరించాలని న్యాయమూర్తి నిర్ణయించుకున్నారు. ఈ మద్య సినిమా టైటిల్ పెట్టినప్పటి నుంచి..రిలీజ్ అయ్యే వరకు ఏదో ఒక కాంట్రవర్సీకి గురి అవుతూనే ఉన్నాయి. ఆ మద్య భారత దేశ వ్యాప్తంగా ‘పద్మావత్’, ‘మెర్సల్’ ఎన్నో విమర్శలు పుట్టుకొచ్చాయి. ఈ మద్య విజయ్ నటించిన ‘సర్కార్’మూవీపై ఎన్నో వివాదాలు చుట్టుముట్టాయి. మరి ఈ వివాదం ఎంత వరకు వెళ్తుందో..సినిమాకు ప్లస్ అవుతుందా..మైనస్ అవుతుందా వేచి చూడాలి.