అరవింద సమేతలో హాట్ టాపిక్ గా మారిన యూటర్న్ !

Seetha Sailaja
అక్టోబర్ లో రానున్న దసరా పండుగను టార్గెట్ చేస్తూ విడుదలకాబోతున్న ‘అరవింద సమేత’ ప్రమోషన్ సెప్టెంబర్ రెండవ వారం నుండి ప్రారంభం కాబోతోంది. ఈమూవీ ఆడియో ఫంక్షన్ వచ్చేనెల రెండవ వారంలో తిరుపతిలో అత్యంత భారీ స్థాయిలో చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది ఇలా ఉంటె ఈమూవీకి సంబంధించి రెండవ టీజర్ ను వీలైనంత త్వరలో విడుదల చేయమని ఈమూవీ బయ్యర్లు త్రివిక్రమ్ పై రోజురోజుకు ఒత్తిడి పెంచుతున్నట్లు సమాచారం.

స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా విడుదలైన ఈమూవీ టీజర్ హిట్స్ పరంగా సంచలనాలు క్రియేట్ చేసినా ఆసంచలనాలు ఈమూవీ బయ్యర్లకు ఏమాత్రం ధైర్యం కలిగించడం లేదు అని టాక్. త్రివిక్రమ్ జూనియర్ ల కాంబినేషన్ లో రాబోతున్న ‘అరవింద సమేత’ ఆ అంచనాలకు అనుగుణంగా కాకుండా ఒక మాస్ డైరెక్టర్ ఒక టాప్ హీరోతో తీసిన సినిమా టీజర్ లా రొటీన్ గా ఉంది అని కామెంట్స్ వస్తున్న నేపధ్యంలో త్రివిక్రమ్ మార్క్ ను చూపెడుతూ ఈసినిమాకు సంబంధించి మరొక టీజర్ వినాయకచవితి రోజున విడుదల చేయమని ఈమూవీ బయ్యర్లు త్రివిక్రమ్ ను అడుగుతున్నట్లు సమాచారం. 

ఫ్యామిలీ సినిమాలకు చిరునామాగా ఉండే త్రివిక్రమ్ మొట్టమొదటిసారి జూనియర్ తో సినిమాను చేస్తున్న నేపధ్యంలో త్రివిక్రమ్ జూనియర్ మాస్ స్టైల్ లోకి వెళ్ళిపోయాడు అన్నకామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనితో ‘అరవింద సమేత’ ను అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ప్రమోట్ చేయకపోతే ఈమూవీకి కోరుకున్న స్థాయిలో అత్యంత భారీ కలక్షన్స్ రావు అన్న తమ అభిప్రాయాన్ని బయ్యర్లు త్రివిక్రమ్ దృష్టికి తీసుకు వచ్చినట్లు టాక్.

దీనితో ఎలర్ట్ అయిన త్రివిక్రమ్ జూనియర్ పూజా హెగ్డే సునీల్ మధ్య నడిచే ఒక కామెడీ ట్రాక్ సీన్ ను హైలెట్ చేస్తూ ఇప్పుడు మరో టీజర్ ను కట్ చేసే పనిలో త్రివిక్రమ్ టీమ్ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈమధ్య కాలంలో టాప్ హీరోల సినిమాలు ఏమాత్రం అంచనాలు తేడాలు వచ్చినా ఘోరమైన ఫ్లాప్ లుగా మారుతున్న నేపధ్యంలో ఈమూవీని అటు మాస్ కు ఇటు క్లాస్ కు నచ్చే విధంగా రూపొందించడంలో త్రివిక్రమ్ తెగ టెన్షన్ పడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: