మెగా ఫ్యామిలీ పై ఉదారతతో మహేష్ !

Seetha Sailaja
గత కొంతకాలంగా మహేష్ ఫిలిం ఇండస్ట్రీ వర్గాలలో అందరివాడుగా మారాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ ప్రయత్నాలలో భాగంగానే తన ‘భరత్ అనే నేను’ మూవీ ఫంక్షన్ కు జూనియర్ ను అతిధిగా పిలిచాడు. ఇప్పటికే రామ్ చరణ్ తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్న మహేష్ రామ్ చరణ్ కు సంక్రాంతి హీరోగా ఏకచత్రాధిపత్యంగా మారి సంచలనాలు సృష్టించడానికి మహేష్ పరోక్షంగా సహకరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం మహేష్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటిస్తున్న తన 25వ సినిమాను వేగంగా పూర్తి చేసి రాబోతున్న సంక్రాంతికి విడుదల చేయాలని భావించాడు. దీనితో సంక్రాంతికి చరణ్ మహేష్ ల మధ్య వార్ నడుస్తుందా అన్న ఊహాగానాలు వచ్చాయి. అయితే మహేష్ మళ్ళీ తన ఆలోచనలు మార్చుకుని ఈసినిమాను నెమ్మదిగా చేసి వచ్చే ఏడాది సమ్మర్ రేస్ కు రెడీ పెట్టాలని భావిస్తున్నట్లు టాక్. 

దీనికితోడు ఈమూవీ నిర్మాతలలో ఒకరుగా వ్యవహరిస్తున్న దిల్ రాజ్ వెంకటేష్ వరుణ్ తేజ్ లతో ఈమధ్యనే మొదలుపెట్టిన ‘ఎఫ్-2’ సినిమాను వేగంగా పూర్తిచేసి సమ్మర్ రేస్ కు తీసుకురావాలి అన్న ఉద్దేశ్యంతో ఉన్న నేపధ్యంలో దిల్ రాజ్ సలహా కూడ మహేష్ ను ప్రభావితం చేసింది అని అంటున్నారు.

దీనికితోడు మహేష్ కు బ్లాక్ బస్టర్ హిట్స్ వచ్చిన ‘పోకిరి’ ‘భరత్ అనే నేను’ మూవీలు సమ్మర్ లో విడుదలై సూపర్ హిట్ అయిన నేపధ్యంలో మహేష్ తనకు కలిసి వచ్చిన సమ్మర్ సెంటిమెంట్ కు ఓటు వేశాడని టాక్. అయితే గతంలో ఇదే సమ్మర్ సెంటిమెంట్ ను నమ్ముకుని మహేష్ తన ‘యువరాజు’, ‘నిజం’, ‘నాని’ ‘బ్రహ్మోత్సవం’  సినిమాలను విడుదల చేసినా అవి ఫెయిల్ అయిన నేపద్యంలో ఈ సమ్మర్ సెంటిమెంట్ మహేష్ కు ఎంత వరకు కలిసి వస్తుందో చూడాలి. ఏది ఎలా ఉన్నా ఈ సెంటిమెంట్ తో మహేష్ చరణ్ పై ఉదారత ప్రదర్శించాడనుకోవాలి..   


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: