ఈ మద్య సోషల్ మీడియా పుణ్యమా అని ప్రతి చిన్న విషయం వైరల్ గా మారిపోతుంది. ముఖ్యంగా సెలబ్రెటీల విషయంలో సెకన్లలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ మద్య రోడ్డుపై ప్లాస్టిక్ ఎందుకు పారేస్తున్నారు? డస్ట్బిన్ ఉపయోగించండి’ అంటూ ఓ వ్యక్తిపై అరుస్తున్న వీడియోను షేర్ చేసి విరుష్కలు వార్తల్లో నిలిచారు. అయితే చాలా మట్టుకు నెటిజన్లు అనుష్క, విరాట్ కోహ్లిలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరు చేసింది మంచి పనే కానీ..ఆ విధంగా రియాక్ట్ కాకుండా కాస్త తమ హోదాకు తగ్గట్టు సౌమ్యంగా వ్యవహరించి ఉంటే బాగుండు అని నెటిజన్లు అంటున్నారు.
అనుష్క నోరు పారేసుకున్న ఆ వ్యక్తి అర్హాన్ సింగ్ గురించి ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు వెలుగు చూసింది. 90వ దశకంలో బాలనటుడిగా పలు చిత్రాల్లో నటించాడు. షారుఖ్ ఖాన్-మాధురీ దీక్షిత్ జోడీగా నటించిన ‘ఇంగ్లీష్ బాబు దేశీ మేమ్’లో హీరో మేనల్లుడి పాత్రలో అర్హాన్ నటించి మెప్పించాడు. అంతేకాదు రాజా, దేఖ్ బాయ్ దేఖ్, 2010లో షాహిద్ కపూర్ హీరోగా నటించిన ‘పాఠశాల’లోనూ అర్హాన్ నటించాడు.
ప్రస్తుతం ఈవెంట్ మేనేజర్ గా, బాలీవుడ్ సినిమాలకు కో-ఆర్డినేటర్ గా పనిచేస్తున్నాడు. హిందీ చిత్ర పరిశ్రమలోని చాలా మంది పెద్దలతో అర్హాన్ కు మంచి పరిచయాలే ఉన్నాయి. పలు చిత్రాల ఫంక్షన్స్ ఆర్గనైజ్ చేసి, వాటిని నిర్వహించే వ్యాపారం ఉంది. ప్రస్తుతం అర్హాన్ సింగ్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారటంతో అతనికి సంబంధించిన విషయాలు వెలుగులోకి వచ్చాయి.