ఆ దర్శకుడితో మెగాస్టార్ సంచలన నిర్ణయం!

siri Madhukar
టాలీవుడ్ ఇండస్ట్రీలో కొంత మంది డైరెక్టర్లు ఒక్క సినిమాతోనే తమ టాలెంట్ ఏంటో చూపిస్తారు. అలాంటి డైరెక్టర్లలో ఒకరు కొరటాల శివ.  రచయితగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కొరటాల ప్రభాస్ హీరోగా మిర్చి సినిమాతో తన సత్తా ఏంటో చాటాడు.  ఆ తర్వాత శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు దర్శకత్వం వహించారు.  ఈ మద్య మహేష్ బాబు తో ‘భరత్ అనే నేను’లాంటి రాజకీయ నేపథ్యంలో ఉన్న సినిమాతో మరో ఘన విజయం అందుకున్నాడు.  దీంతో ఇండస్ట్రీలో టాప్ హీరోలు కొరటాల వైపు చూస్తున్నారు.  ఇక టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి ఓ రేంజ్ లో తన సినిమాలతో ప్రజలను ఉర్రూతలూగించారు. 

శంకర్ దాదా జిందాబాద్ సినిమా తర్వాత రాజకీయాల్లోకి వెళ్లిన ఆయన పదేళ్ల తర్వాత వివివినాయక్ దర్శకత్వంలో ‘ఖైదీ నెంబర్ 150’సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు.  వచ్చే రావడమే మాస్ ఎంట్రటైన్ మెంట్ తో పాటు రైతులకు మంచి మెసేజ్ ఇచ్చిన సినిమా కావడంతో ఆ సినిమా అద్భుతమైన విజయం సాధించింది.  ప్రస్తుతం చిరంజీవి .. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'సైరా' సినిమా చేస్తున్నారు.  ఈ సినిమా తాజా షెడ్యూల్ ను మొదలుపెట్టడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. 

స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చారిత్రక నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీస్తున్నారు. ఆలస్యంగా సెట్స్ పైకి వచ్చిన ఈ సినిమా ఇంతవరకూ 30 శాతం చిత్రీకరణను మాత్రమే జరుపుకుంది. షూటింగు పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు రావడానికి చాలా సమయం పడుతుంది. అయితే ఖైదీ నెంబర్ 150 తర్వాత చాలా గ్యాప్ తీసుకుంటున్న చిరంజీవి ఆ గ్యాప్ పూడ్చుకోవడానికి కొరటాలతో మరో సినిమా తీయబోతున్నట్లు ఫిలిం వర్గాల టాక్.

అభిమానులకి .. తనకి మధ్య అంత గ్యాప్ రాకూడదని భావించిన చిరంజీవి, కొరటాల సినిమాను కూడా సాధ్యమైనంత త్వరగా సెట్స్ పైకి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారట. 'సైరా' మూవీకి సంబంధించి గెటప్ ల విషయంలో సమస్య తలెత్తకుండా షెడ్యూల్స్ ప్లాన్ చేయాలని ఆల్రెడీ కొరటాలకి చెప్పారనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిస్తోంది.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: