‘నా పేరు సూర్య’ సక్సెస్ మీట్ లో పవన్ కళ్యాన్!

Edari Rama Krishna
ఈ మద్య తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీలో ఎన్నో ఊహించని మార్పులు వచ్చాయి.  ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి కి పవన్ కళ్యాన్ కి మద్య విభేదాలు వచ్చాయని..తెగ వార్తలు హల్ చల్ చేశాయి.  కానీ చిరంజీవి షష్టి పూర్తి రోజు వాటన్నింటికి పులిస్టాప్ పెట్టారు పవన్ కళ్యాన్.  అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్నయ్యతో మంచి బాంధవ్యాలు కొనసాగిస్తున్నారు. ఇక ఆ మద్య సరైనోడు ఫంక్షన్లో అల్లు అర్జున్ ని కొంత మంది ఫ్యాన్స్ పవన్ గురించి చెప్పమంటే..చెప్పను బ్రదర్ అంటూ వెటకారంగా అనడంతో..కొంత కాలం పవన్ ఫ్యాన్స్, బన్నీ ఫ్యాన్స్ మద్య పెద్ద యుద్దమే అయ్యింది. 

కానీ మొన్న ఫిలిమ్ ఛాంబర్ లో బన్ని, పవన్ కళ్యాన్ ఎంతో ఆప్యాయంగా కలుసుకున్నారు.  దాంతో వీరిద్దరి మద్య కూడా ఎలాంటి బేదాభిప్రాయాలు లేవని తేలిపోయింది.  అంతే కాదు గతంలో పవన్ ఎక్కువ ఫంక్షన్లకు వచ్చేవారు కాదు..కానీ రిసెంట్ గా రాంచరణ్ నటించిన ‘రంగస్థలం’ సక్సెస్ మీట్ కి రావడమే కాదు..చెర్రీని ఆకాశానికి ఎత్తేశాడు. 

తాజాగా అల్లు అర్జున్ నటించిన ‘నా పేరు సూర్య’ చిత్ర గత శుక్రవారం విడుదలైన సంగతి తెల్సిందే. వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని శిరీష శ్రీధర్ లగడపాటి, బన్నీ వాస్ లు సంయుక్తంగా నిర్మించారు.

ఇకపోతే దర్శక నిర్మాతలు ఈ సినిమా యొక్క సక్సెస్ మీట్ నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ఈ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాన్ హాజరుకానున్నారు. హైదరాబాద్లో ఈ సక్సెస్ మీట్ జరగనుంది. మరి ఈ ఫంక్షన్లోల బన్నీ గురించి పవన్ ఏం మాట్లాడనున్నాడో అని మెగా ఫ్యాన్స్ తెగ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  ‘నా పేరు సూర్య’ చిత్రంలో సైనికుడి పాత్రలో అల్లు అర్జున్ ప్రదర్శించిన నటనకిగాను ప్రేక్షకుల నుండి మంచి ప్రసంశలు దక్కుతున్నాయి



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: