అల్లు అరవింద్ ను టార్గెట్ చేసిన సుప్రియ !

Seetha Sailaja
టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులలో ఒకడిగా ఇండస్ట్రీని శాసిస్తున్న ఆ నలుగురులో కీలక వ్యక్తిగా పేరు గాంచిన అల్లు అరవింద్ మాటలకు ఎదురు చెప్పడానికి ఎవరూ సాహసించరు. అలాంటిది అరవింద్ కు కొన్ని రోజుల క్రితం అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగిన టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖుల సమావేశంలో నాగార్జున మేనకోడలు సుప్రియ అరవింద్ ను టార్గెట్ చేస్తూ ఘాటైన కామెంట్స్ చేసింది అంటూ ఒక ప్రముఖ ఇంగ్లీష్ దిన పత్రిక ఒక ఆసక్తికర కథనాన్ని ఈరోజు ప్రచురించింది. 

పవన్ కళ్యాణ్ ను అదేవిధంగా అతడి తల్లిని టార్గెట్ చేసే విధంగా కొన్ని ప్రముఖ ఛానల్స్ నెగిటివ్ ప్రచారాన్ని చేస్తున్నాయి అంటూ దానికి వ్యతిరేకంగా పవన్ తన రాజకీయ కార్యకలాపాలను పక్కకు పెట్టి గత కొద్ది రోజులగా ఆ ఛానల్స్ ను చూడవద్దు అంటూ పవన్ పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. పవన్ పోరాటానికి సపోర్ట్ ఇమ్మని కోరుతూ పిలుపు ఇచ్చిన నేపధ్యంలో కొద్ది రోజుల క్రితం ఈ విషయమై అన్నపూర్ణ స్టూడియోస్ లో జరిగిన సమావేశంలో సుప్రియ అరవింద్ ల మధ్య ఆసక్తికర సంభాషణలు జరిగినట్లు ఆ పత్రిక పేర్కొంది.

 ఈ సందర్భంలో సుప్రియ అరవింద్ ను ఉద్దేసించి మాట్లాడుతూ కొంతకాలం క్రితం ఒక టివి యాంకర్ ఒక హీరోయిన్ విషయమై అసభ్యకరమైన కామెంట్స్ చేసిన విషయాన్ని గుర్తుకు చేస్తూ మాట్లాడిందట. అంతేకాదు అప్పట్లో తాను ఆ కామెంట్స్ ను ఖండించమని కోరుతూ పవన్ కళ్యాణ్ చిరంజీవి అల్లు అర్జున్ రామ్ చరణ్ లకు మెసేజ్ లు పెట్టినా స్పందించని సందర్భాలను గుర్తుకు చేసి అప్పుడు ఆవిషయాలు అన్యాయంగా అనిపించలేదా అంటూ అరవింద్ ను అందరి ఎదురుగా సుప్రియ ప్రశ్నించిందని ఆ పత్రిక వివరణాత్మకంగా వార్తను వ్రాసింది.  

దీనితో ఊహించని ఈ పరిణామానికి అరవింద్ షాక్ ఐనట్లు తెలుస్తోంది. ఆ తరువాత అరవింద్ టివి9 ఎబిఎన్ ఛానల్స్ కార్యక్రమాలకు టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల వారు ఎవరూ వెళ్ళకూడదు అన్న తీర్మానాన్ని పెట్టడానికి ప్రయత్నించినప్పుడు ఇండస్ట్రీ పెద్దలతో పాటు సుప్రియ కూడ తీవ్రంగా వ్యతిరేకించినట్లు టాక్. ఒకవైపు నాగార్జున చిరంజీవిలు అత్యంత స్నేహంగా ఉండడమే కాకుండా అనేక వ్యాపారాలలో భాగస్వాములుగా కొనసాగుతున్న నేపధ్యంలో నాగార్జున మేనకోడలు ఈవిధంగా అరవింద్ ను కార్నర్ చేయడం వెనుక ఆంతర్యం ఏమిటి అన్న విషయమై రకరకాల భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: