పవన్ ను కార్నర్ చేసిన శివాజీ కామెంట్స్ !

Seetha Sailaja
పవన్ కళ్యాణ్ తన ఘాటైన వ్యాఖ్యలతో వేడిన పెంచుతున్న కొద్ది పవన్ ను టార్గెట్ చేస్తూ అనేకమంది వరసగా పవన్ పై మాటలదాడి చేస్తున్నారు. ఇప్పుడు ఈ లిస్టులో హీరో శివాజీ కూడ చేరిపోయాడు. అంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ కోసం పోరాటం చేస్తున్న శివాజీ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ ను టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.

పవన్ కేంద్రప్రభుత్వాన్ని వదిలి కేవలం రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్స్ తనకు నచ్చలేదని ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదో ఇవ్వకపోవడంలో ప్రధాన శత్రువు కేంద్ర ప్రభుత్వం అన్న చిన్న విషయాన్ని పవన్ ఎందుకు మర్చిపోయాడో అర్ధం కావడం లేదు అంటూ ఆసక్తికర కామెంట్స్ చేసాడు. ఈవిషయాలన్నీ పక్కకు పెట్టి పవన్ అవినీతి గురించి మాట్లాడటం తనకు ఆశ్చర్యం కలిగించింది అంటూ అవినీతి కొన్ని తరాలుగా ఇండియాను షేక్ చేస్తున్న విషయం పవన్ కు తెలియదా అంటూ ఎదురు ప్రశ్నలు వేసాడు శివాజీ. 

అవినీతి పై అన్ని రాజకీయ పార్టీలు మాత్రమే కాకుండా ప్రముఖుల దగ్గర నుండి సామాన్యుల వరకు మాట్లాడుతున్న పరిస్థితులలో ఎవరు అవినీతి పరుడు అన్న విషయం తేల్చడం జరిగేపని కాదు అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్త పరిచాడు. అంతేకాదు ఎవరైనా మార్కెట్ ధరకన్నా ఒక ఆస్థిని తక్కువధరకు కొనుక్కోవడం కూడ అవినీతి కిందే వస్తుంది అంటూ పరోక్షంగా పవన్ గుంటూరు దగ్గర కాజ గ్రామంలో కట్టుకుంటున్న ఇంటి ప్రస్తావన తీసుకువచ్చాడు.

అంతేకాదు ప్రస్తుత సమాజమే అవినీతి మయంగా మారిపోయిందని దీనితో ఎవరు అవినీతి పరులు అన్న విషయమై చర్చలు జరపడం కాలం వృథా తప్పించి ఎటువంటి ప్రయోజనం ఉండదు అంటూ సెటైర్లు వేసాడు శివాజీ. ఇలాంటి పరిస్థుతులలో అస్పష్టమైన విషయాల పై పవన్ పోరాటం చేయకుండా తన పోరాటంలోని విషయాల పై పవన్ క్లారిటీ ఇస్తే బాగుంటుంది అంటూ కామెంట్ చేసాడు. ఈ కామెంట్స్ విన్న చాలామంది ఒక విషయం పై శివాజీకి ఉన్న క్లారిటీ పవన్ కు ఎందుకు లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: