యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కు గుడ్న్యూస్...!
తెలుగు ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్. తొలిసినిమా స్టూడెంట్ నెం.1 చిత్రం మొదలు ఇప్పటి వరకు ఎన్నో విభిన్నమైన పాత్రలతో మెప్పించిన ఎన్టీఆర్ డ్యాన్స్, ఫైట్స్, యాక్షన్ పరంగా తనదైన స్టైల్ ప్రదర్శిస్తూ..తెలుగు ప్రేక్షకుల మనసు దోచాడు. గత మూడు సంవత్సరాల నుంచి హ్యాట్రిక్ విజయం సాధించిన ఎన్టీఆర్ తాజాగా బాబీ దర్శకత్వంలో ‘జై లవకుశ’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి నందమూరి కళ్యాన్ రామ్ నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు.
ఇప్పటి వరకు ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి క్రేజ్ వచ్చింది. అయితే జై లవకుశకు సంబంధించిన టీజర్ ఇప్పటి వరకు రాలేదు..ఆ మద్య సోషల్ నెట్ వర్క్ లో ఓ టీజర్ లీక్ అయ్యింది.. అది అధికారింగా కాదని తేల్చి చెప్పారు చిత్ర యూనిట్. తాజాగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ మంచి శుభవార్త చెప్పారు..నిర్మాత నందమూరి కళ్యాన్. ఈ చిత్రంలో ఎన్టీఆర్ జై, లవ, కుశ అనే మూడు విభిన్న పాత్రలను పోషిస్తున్నాడు. ఈనెల ఆరున సాయంత్రం ఐదున్నరకు రిలీజ్ చేయనున్నట్టు కళ్యాన్ రామ్ తెలిపారు.
మొదట జై జై పాత్రకు సంబంధించిన టీజర్ ని విడుదల చేసి తర్వాత మిగతా పాత్రలకు సంబంధించిన టీజర్లు రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారట. అయితే టెంపర్ చిత్రంలో ఎన్టీఆర్ మొదట నెగిటీవ్ షేడ్స్ లో కనిపించిన విషయం తెలిసిందే..ఇక జై లవకుశ చిత్రంలో కూడా జై పాత్ర నెగిటీవ్ షేడ్స్ లో ఉండబోతుందట. మరి మూడు విభిన్న పాత్రల్లో ఎన్టీఆర్ ఎలా మెప్పించబోతున్నాడో అని ఫ్యాన్స్ కుతూహలంగా ఉన్నారు.