కీర్తి సురేష్ సంతోషంలో ఏం చేసిందో తెలుసా..!

Edari Rama Krishna
తెలుగు ఇండస్ట్రీలో గత కొంత కాలంగా మళియాళ భామల హవా పెరిగిపోయింది.  నయనతార, సమంత, నిత్యామీనన్ ఇలా చాలా మంది మళియాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన  టాలీవుడ్, కోలీవుడ్ ని ఏలుతున్నారు.   తాజాగా మళియాళ ఇండస్ట్రీ నుంచి మరో భామ ఇప్పుడు టాప్ పోజీషన్లోకి వచ్చింది.  తెలుగు లో రామ్ హీరోగా నటించిన ‘నేను శైలజ’ చిత్రంలో హీరోయిన్ గా నటించిన కీర్తి సురేష్ అతి తక్కువ కాలంలోనే మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.  ప్రస్తుతం ఈ అమ్మడు ప్రస్తుతం పవన్ 25వ చిత్రంలో కథానాయికగా నటిస్తుంది.  

త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే అను ఇమ్మాన్యుయేల్ పై కొన్ని సీన్స్ చిత్రీకరించిన టీం మంగళవారం నుండి కీర్తి సురేష్ పై కూడా కొన్ని సీన్స్ ని చిత్రీకరించినట్టు తెలుస్తుంది.  ఈ సందర్భంగా తన సంతోషాన్ని ట్విట్టర్ లో తెలియజేసింది.  పవన్ కళ్యాణ్ సర్, త్రివిక్రమ్ సర్ లతో కలిసి నా కొత్త చిత్రాన్ని స్టార్ట్ చేయడం చాలా ఆనందంగా ఉందని, మీ అందరి ఆశీర్వాదాలు, ఆదరణ కావాలి అంటూ కోరింది కీర్తి సురేష్.

హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు.  ఈ చిత్రంలో మరో ముఖ్య పాత్రలో సీనియర్ నటి ఖుష్బూ నటిస్తున్నారు.  గతంలో స్టాలిన్ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవికి అక్కగా నటించింది.  అయితే ఈ చిత్రంలో కూడా పవన్ కళ్యాన్ కి అక్కగా నటించబోతున్నట్టు టాక్. అక్టోబరులో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

కీర్తి సురేష్ ట్విట్ :



Happy to have started my next in Telugu today with @PawanKalyan sir, #Trivikram Sir, @haarika_hassine Need all your love and support 😊🙏

— Keerthy Suresh (@KeerthyOfficial) April 4, 2017

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: