నాగార్జున మాటలు దేనికి సంకేతం!

Seetha Sailaja
‘ఓం నమో వెంకటేశాయ’ మూవీ ని ప్రమోట్ చేస్తూ నాగార్జున చేసిన కామెంట్స్ దేనికి సంకేతం అన్న కామెంట్స్  కొందరు చేస్తున్నారు. తన నటన చూసి కొందరికి తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు గుర్తుకొచ్చినట్లు చెప్పారని అంటూ నాగార్జున ఒక సెటైర్ వేసాడు. కొంత మంది దగ్గర నుండి ఈ ప్రశంసలు వచ్చిన తరువాత ‘‘నాకు వయసు అయిపోతోంది కదా అందుకే నాన్నగారిలా కనిపించానేమో పతాక సన్నివేశాల్లో నన్ను చూస్తుంటే నాన్నగారిని చూస్తున్నట్లే కనిపించింది అని కొందరు చెప్పారు. ఆ మాటలు నాకెంతో సంతోషాన్నిచ్చాయి. అయితే వయసు అయిపోయింది అంటే భయం ఉంటుంది కదా” అంటూ జోక్ చేసాడు వెండితెర మన్మధుడు.  

ఇదే సందర్భంలో మరో ప్రశ్నకు సమాధానం ఇస్తూ ‘మనం’ సినిమాకు సీక్వెల్ అన్న ఆలోచన తన మనసులో కూడ రాదు అని అంటూ ఆ సినిమాను టచ్ చేసే శక్తి తనకు లేదు అని అంటూ తమ కుటుంబానికి ఆసినిమాతో చాలా సెంటిమెంట్లు ముడిపడి ఉన్నాయి అన్న అభిప్రాయాన్ని బయట పెట్ట్టాడు.  ప్రస్తుతం బయోపిక్స్ హవా నడుస్తున్న నేపథ్యంలో తన పై ఎవరైనా  భవిష్యత్తులో బయోపిక్ తీస్తారని అనుకుంటున్నారా అని అడిగిన ప్రశ్నకు నాగార్జున  అందరికీ షాక్  ఇచ్చే సమాధానం ఇచ్చాడు.

ఒకొక్కసారి తన జీవితం తనకే  చాలా బోరింగ్ గా ఉంటుందని  అంటూ తన బయోపిక్ కూడా బోరింగ్‌గానే ఉంటుంది  కదా అని షాకింగ్ కామెంట్స్ చేసాడు. అంతేకాదు  తన జీవితంలో అత్యంత గొప్పగా చూపించవలసిన విషయాలు ఏమి ఉన్నాయి అంటూ మరో షాక్ ఇచ్చాడు నాగార్జున. అయితే ‘సోగ్గాడే చిన్నినాయనా’ కు ప్రీక్వెల్ అయిన ‘బంగార్రాజు’ చేయాలని చాలా ఉత్సాహంగా ఉందని ఈ మూవీ ఈఏడాది చివరిలోపు సెట్స్ మీదికి వెళ్తుందని అంటూ ఏమాత్రం అవకాసం ఉన్న ఆ మూవీలో నాగచైతన్య అఖిల్ లకు రెండు ప్రత్యేక పాత్రలు క్రియేట్ చేయాలి అన్న ఆలోచనలు ఉన్నట్లు లీకులు ఇస్తున్నాడు నాగార్జున. 

తన కెరియర్ ప్రారంభం నుండి వెరైటీ సినిమాలు చేస్తూ కొత్త దర్శకులను చాలా మందిని  ప్రోత్సహించిన నాగార్జున ప్రస్తుతం లేటెస్ట్ గా ఓంకార్ దర్శకత్వంలో నటిస్తున్న ‘రాజు గారి గది’ సీక్వెల్ లో నటిస్తున్న సందర్భంలో ఆ మూవీలోని తన పాత్ర కోసం ఒక డిఫరెంట్ గెటప్ లో కనిపించ బోతున్నాడు.  అయితే ఎన్నో విజయ వంత మైన సినిమాలో నటించి ఎంతో పేరు తెచ్చుకున్న నాగార్జున ఒక్కొక్కసారి తనకు తన జీవితం బోర్ కొడుతోంది అన్న ఫీలింగ్ ను వ్యక్త పరచడం అందరికీ షాక్ ఇచ్చే విషయం..



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: