అనుపమ పరమేశ్వరన్ పై షాకింగ్ న్యూస్ ?

Seetha Sailaja
తెలుగు ప్రేక్షకులకు ముఖ్యంగా నేటితరం యూత్ కు క్రేజీ బ్యూటీగా అనుపమా పరమేశ్వరన్ మారిపోవడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమెకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఆమె ఇప్పటి వరకు తెలుగులో నటించిన సినిమాలు కేవలం 3మాత్రమే అయినా ఒక టాప్ హీరోయిన్ కు వచ్చినంత క్రేజ్ ఈ మెకు ఏర్పడటం టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.  

దీనికితోడు గతనెల విడుదలైన ‘శతమానం భవతి’ సూపర్ హిట్ కావడంతో ప్రస్తుతం ఈమె టాలీవుడ్ కు గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా మారిపోయింది.  దీనితో ఈ మెకు ఆఫర్స్ వరసపెట్టి వచ్చిపడుతూ ఉండటంతో తన సొంత రాష్ట్రం కేరళాకు వెళ్ళడం మానివేసి ప్రస్తుతం హైదరాబాద్ ను తన శాశ్విత చిరునామాగా చేసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. 

ఈ పరిస్తుతులు ఇలా ఉండగా ఆమె ప్రస్తుతం యంగ్ హీరో శర్వానంద్ తో ఎక్కువసేపు కాలం గడుపుతోంది అన్న వార్తలు ఫిలింనగర్ ని షేక్ చేస్తున్నాయి.  అంతేకాదు ఆమె శర్వానంద్ తో కలిసి రాత్రిపూట పార్టీలకు వెళుతోందని ఫిల్మ్ సర్కిల్స్ లో గుసగుసలు వినపడుతున్నాయి. అయితే కేవలం సినిమా సక్సస్ పార్టీలే కాకుండా అదేపనిగా ఆమె శర్వానంద్ తోనే అంటి పెట్టుకుని ఉంటోందని ఫిలిం నగర్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. 

అయితే ఇది అంతా సర్వసాధారణ విషయం అని సినిమా రంగంలో ఒక యంగ్ హీరో హీరోయిన్స్ చనువుగా ఉంటే ఇలాంటి వార్తలే పుట్టుకు వస్తాయి అంటూ శర్వానంద్ సన్నిహితులు ఈ వార్తలను కొట్టి పారేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వరస హిట్లతో దూసుకుపోతున్న శర్వానంద్ ఇంటికి వరస పెట్టి దర్శక నిర్మాతలు క్యూ కడుతున్న నేపధ్యంలో లేటెస్ట్ గా శర్వా సన్నిహితురాలిగా అనుపమా పరమేశ్వరన్ అవ్వడం షాకింగ్ న్యూస్ గా మారింది.. 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: