అందమైన భామల కు ఇండియాకే పెటెంట్ : తమన్నా

తమన్నా, ఒక్క తలపుతోనే మదిలో మెదిలే సౌందర్య సమ్మోహనం. పాలరాతి శిల్పం. మిల్కి బ్యూటీ. మేని తళుకులతో, విరుపు లతో, వంపులతో, కవ్వింపులతో, పరువాల పల్లవింపులతో ఒక దశాబ్ధ కాలం నుంచి యువతకు నిద్దురలేకుందా చేస్తుంది.


కలర్‌ఫుల్‌ అమ్మాయిలకు ఇండియానే పేటెంట్‌ అని నటి తమన్నా అంటున్నారు. "అందానికే అందం ఈ పుత్తడి బొమ్మ" అని ఈ మిల్కీబ్యూటీని పేర్కొనవచ్చు. పాలరాతి బొమ్మలాంటి మేని అన్దంతో కుర్రకారుని కిర్రెక్కిస్తున్న తమన్నా దశాబ్దం దాటి నేటికీ మేటి నటిగా రాణిస్తున్నారు. రాజమౌళి బాహుబలి చిత్రం తమన్నా నటిగా ఆమె రూపు రెఖలనే మార్చేసింది. ఆ చిత్రంలో అంత అందంగా ప్రేక్షకులను కనువిందు చేశారు. దీంతో ప్రస్తుతం బాహుబలి–2 కోసం అన్నివర్గాల వారు ఆత్రుతగా ఎదురు చూస్తు న్నారు. ఇక తమిళంలో శింబుతో రొమాన్స్‌ చేస్తున్న "ట్రిబుల్‌ ఏ" అన్బానవన్‌ అసరాదవన్‌ అడంగాదవన్‌ అనే చిత్రంపైనా అంచనాలు రోజు రోజుకు పేరుగుతున్నాయి.


ఇది ఇలా ఉండగా దక్షిణాదిలో పాలరాతి బొమ్మలుగా పేరు తెచ్చుకున్న నటి తమన్నా, హన్సిక వారి మేని ఛాయ కారణంగా కొన్ని అవకాశాలు కొల్పోవలసి వచ్చిందా?

కలర్‌ తక్కువ హీరోయిన్ల (బ్లాక్ బ్యూటీలు) కే కథా బలం ఉన్న అవకాశాలు లభిస్తున్నాయా? మీలాంటి మిల్కీ అందాల భామలను గ్లామర్ పాత్రలకే పరిమితం చేస్తున్నారా? ఇలాంటి ప్రశ్నలు చిత్ర పరిశ్రమ వర్గాల్లో ప్రచారంలో ఉండటం తో - అవే ప్రశ్నలను నటి తమన్నా ముందుంచ గా తను ఎలాంటి బదులిచ్చారో చూద్దాం.


"కలర్‌ నాకు ఎలాంటి ఇబ్బందిని కలిగించలేదు. నాకు రావలసిన అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే నేను నటించిన రెండు చిత్రాల్లో కాస్త రంగు ఛాయ తగ్గించుకునే నటించాను. అందులో ఒకటి బాహుబలి. ఆ చిత్రం ఎంత ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.  శరీరఛాయ అన్నది ఒక సమస్య కానే కాదు. ఇంకా చెప్పాలంటే కలర్‌ఫుల్‌ అమ్మాయిలకు ఇండియానే పేటెంట్‌. మహిళలు ఏ కలర్‌లో ఉన్నా అది వారికి అందమే" అని ఝలక్ ఇచ్చిందీ నవ సమ్మోహిని తమన్నా.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: